Read more!

English | Telugu

తారక్, మహేష్ ఫ్యాన్స్ కి అసలుసిసలు పండగ!

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి-కొరటాల శివ, సమంత, దేవిశ్రీప్రసాద్-తమన్ ఈ షోకి గెస్ట్ లుగా వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ షోకి మహేష్ బాబు గెస్ట్ గా రాబోతున్నట్లు షో నిర్వాహకులు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి గెస్ట్ గా మహేష్ రాబోతున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ షూట్ కూడా ఎప్పుడో పూర్తయింది. షూట్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. మొదట ఈ ఎపిసోడ్ దసరా కానుకగా టెలికాస్ట్ కానుందని న్యూస్ వినిపించింది. కానీ ఆ ప్లేస్ లో సమంత ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఇక దీపావళికి టెలికాస్ట్ కానుందని ప్రచారం జరగగా.. ఆ ప్లేస్ లో దేవిశ్రీప్రసాద్-తమన్ ల ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. దీంతో మహేష్ ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అని డ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ని ఖుషీ చేసే న్యూస్ తాజాగా వచ్చింది. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుందని తెలియజేస్తూ తాజాగా షో నిర్వాహకులు పోస్టర్ ను విడుదల చేశారు.

తారక్, మహేష్ లకు మంచి బాండింగ్ ఉంది. మహేష్ ని తారక్ అన్నయ్య అని పిలుస్తాడు. గతంలో వీళ్ళిద్దరూ 'భరత్ అనే నేను' ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఒకే స్టేజ్ పై కనిపించి కనువిందు చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి బుల్లితెరపై సందడి చేస్తే షోకి రికార్డ్ రేటింగ్స్ రావడం ఖాయమనే చెప్పాలి.