English | Telugu

తారక్, మహేష్ ఫ్యాన్స్ కి అసలుసిసలు పండగ!

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి-కొరటాల శివ, సమంత, దేవిశ్రీప్రసాద్-తమన్ ఈ షోకి గెస్ట్ లుగా వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ షోకి మహేష్ బాబు గెస్ట్ గా రాబోతున్నట్లు షో నిర్వాహకులు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి గెస్ట్ గా మహేష్ రాబోతున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ షూట్ కూడా ఎప్పుడో పూర్తయింది. షూట్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. మొదట ఈ ఎపిసోడ్ దసరా కానుకగా టెలికాస్ట్ కానుందని న్యూస్ వినిపించింది. కానీ ఆ ప్లేస్ లో సమంత ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఇక దీపావళికి టెలికాస్ట్ కానుందని ప్రచారం జరగగా.. ఆ ప్లేస్ లో దేవిశ్రీప్రసాద్-తమన్ ల ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. దీంతో మహేష్ ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అని డ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ని ఖుషీ చేసే న్యూస్ తాజాగా వచ్చింది. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుందని తెలియజేస్తూ తాజాగా షో నిర్వాహకులు పోస్టర్ ను విడుదల చేశారు.

తారక్, మహేష్ లకు మంచి బాండింగ్ ఉంది. మహేష్ ని తారక్ అన్నయ్య అని పిలుస్తాడు. గతంలో వీళ్ళిద్దరూ 'భరత్ అనే నేను' ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఒకే స్టేజ్ పై కనిపించి కనువిందు చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి బుల్లితెరపై సందడి చేస్తే షోకి రికార్డ్ రేటింగ్స్ రావడం ఖాయమనే చెప్పాలి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.