English | Telugu

'ఎవరు మీలో కోటీశ్వరులు'.. మహేష్ ఎపిసోడ్ కి ఇంత దారుణమైన రేటింగా!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల బుల్లితెరపై 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో అలరించిన సంగతి తెలిసిందే. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాగా ఆ ఎపిసోడ్ కి 11.4 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత ఈ షోకి ఆ స్థాయిలో రేటింగ్ రాకపోయినా.. సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చినప్పుడు ఓ మాదిరి రేటింగ్ వచ్చింది. ఇక ముగింపు ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేయడంతో ఈ ఎపిసోడ్ కి.. ఫస్ట్ ఎపిసోడ్ కి వచ్చిన రేంజ్ రేటింగ్ వస్తుందని భావించారంతా. కానీ అనూహ్యంగా అందులో సగం కూడా రాకపోవడం గమనార్హం.

ఈఎంకేలో మహేష్ సందడి చేసిన ఎపిసోడ్ కి కేవలం 4.9 టీఆర్పీ మాత్రమే నమోదైంది. ఇద్దరు స్టార్స్ ఉన్నప్పటికీ ఈ ఎపిసోడ్ కి ఇంత దారుణమైన రేటింగ్ రావడానికి అనేక కారణాలున్నాయి. మహేష్ ఈఎంకే షో షూట్ లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో ముందే లీక్ అయ్యాయి. దీంతో ఆ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ నిర్వాహకులు మాత్రం దసరా, దీపావళి ఇలా ఎన్నో అకేషన్స్ వచ్చినా మహేష్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయకుండా చివరి ఎపిసోడ్ కోసం హోల్డ్ చేసి ఉంచారు. దీంతో ఈ ఎపిసోడ్ పై రోజురోజుకి ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది. దానికితోడు ఈ షో మిగతా ఎపిసోడ్స్ ప్రతివారం సోమవారం నుంచి గురువారం వరకు ప్రసారమైతే.. మహేష్ ఎపిసోడ్ మాత్రం ఆదివారం టెలికాస్ట్ అయింది. అది కూడా ఎపిసోడ్ రేటింగ్ పై ప్రభావం చూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ఓవరాల్ గా కూడా ఆశించినస్థాయిలో రేటింగ్స్ ని రాబట్టలేదని తెలుస్తోంది. గతంలో బిగ్ బాస్ షోతో తారక్ ఆకట్టుకున్నాడు. ఆ షోకి రికార్డ్ రేటింగ్స్ వచ్చాయి. అయితే ఈఎంకే షో ఓల్డ్ ఫార్మాట్ కావడంతో అంచనాలకు తగ్గ రేటింగ్స్ ని సాధించలేక పోయిందని అంటున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.