English | Telugu

నిన్న‌టి వ‌ర‌కు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్ప‌డు పెళ్లాం?

బిగ్‌బాస్ లో ష‌న్ను, సిరిల అరాచ‌కం ప‌రాకాష్ట‌కు చేరింది. మ‌రో రెండు రోజుల్లో సీజ‌న్ ఎండ్ అవుతున్న నేప‌థ్యంలో హౌస్ లో వీరి చేష్ట‌లు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. ఎంత‌లా అంటే చూసే ఆడియ‌న్స్ కి వెగ‌టు పుట్టించేలా. గ‌త కొన్ని వ‌రాలుగా పేరెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి వీళ్ల అతి చేష్ట‌ల‌కు చివాట్లు పెట్టినా `న‌వ్విపోదురుగాక మాకేటి సిగ్గు` అన్న‌ట్టుగా ష‌న్ను, సిరి వ్య‌వంహ‌రిస్తూ హౌస్ లో గ‌బ్బు లేపుతున్నారు. పేరెంట్స్ హ‌గ్గులు మితిమీరు తున్నాయ‌ని, అది మాకు న‌చ్చ‌డం లేద‌న్నా.. ఆంటీ ఇది ఫ్రెండ్షిప్ హ‌గ్ మాత్ర‌మే అంటూ నిస్సిగ్గుగా సిరిని హ‌గ్ చేసుకుంటూనే వున్నాడు ష‌న్ను.

Also Read:మీకు న‌చ్చిన‌ట్లు కాకుండా వాడికి న‌చ్చిన‌ట్లు ఉండ‌నివ్వండి.. దీప్తి ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

గురువారం వీరి ఎపిసోడ్ మ‌రీ ప‌రాకాష్ట‌కు చేరింది. గురువారం ఎపిసోడ్ `గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా..` అనే హుషారైన సాంగ్ తో మొద‌లైంది. ఆ వెంట‌నే సిరి - ష‌ణ్ముఖ్ లు త‌మ రెగ్యుల‌ర్ ప‌నికి తెర‌లేపారు. సోఫాలో సిరి - ష‌ణ్ముఖ్ లు కూర్చుని ఉండ‌గా ష‌ణ్ముఖ్ బిగ్ బాస్‌ని ఇమిటేట్ చేస్తూ సిరిని ఉద్దేశించి `బిగ్‌బాస్ కోరిక మేర‌కు సిరి పెళ్లాం ఇచ్చిన‌ట్టు అడ‌క్కుండానే కాఫీ ఇవ్వ‌కండి` అని అన్నాడు. పెళ్లాం అన‌గానే సిరి సిగ్గుల మొగ్గైంది. ముసి ముసి న‌వ్వులు న‌వ్వుకుంటూ `ఏంటి సార్ మీకు అలా అనిపిస్తుందా? ప‌ఒద్దు పొద్దున్నే ఏమైంది మీకు` అని అడిగింది.

ఈ దృశ్యం.. ఈ మాట‌లు చూసి బిగ్‌బాస్ వీక్ష‌కుల ఫీజులు అవుట్‌.. మ‌రీ ఇంత ప‌రాకాష్ట‌కు చేరుకోవ‌డం ఏంటి సామీ.. నాగార్జున సార్ చూస్తున్నారా? .. ఈ మాట‌లు వింటున్నారా? .. ఏంటీ అరాచ‌కం?.. ఏంటీ మా క‌ర్మ‌.. అంటూ నెటిజ‌న్స్ నెట్టింట వీరంగం మొద‌లుపెట్టారు. బిగ్‌బాస్ ఎండింగ్ కి చేరుకున్నా వీరి అరాచ‌కాల‌కి మాత్రం తెర‌ప‌డ‌టం లేదంటూ ఓ రేంజ్ లో సిరిని, ష‌న్నుని ఏకిపారేస్తున్నారు. మ‌రి దీనిపై శ‌నివారం నాగార్జున కౌంట‌ర్ ఇస్తారా? లేక ఇంకా ముందుకు వెళ్లుంటే బాగుండేది.. వైఫ్ అండ్ హజ్బెండ్ టాస్క్ ఇస్తాలే ఎంజాయ్ చేయిండి అని ఎంక‌రేజ్ చేస్తాడా? అని నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.