English | Telugu

మా కులం వాళ్ళు ఇక్కడొకరున్నారు.. మనవాళ్ళను మనమే తొక్కేయడం మనకు అలవాటు

పాడుతా తీయగా అనేది షో పేరు కానీ ఇందులో కంటెస్టెంట్స్ పాటలు ఎంతలా అలరిస్తున్నాయి గెస్టుల మాటలు, చమత్కారాలు కూడా అంతలా నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో చూస్తే గెస్ట్ గా గరికపాటి వచ్చి తనదైన శైలిలో ఫన్నీ డైలాగ్స్ వేసి ఆడియన్స్ ని నవ్వించారు. ఒక లేడీ కంటెస్టెంట్ వచ్చి "ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట" అనే పాట పాడింది. "భర్తల్ని భార్యలు ప్రేమగా ఏమండోయ్ అని పిలిచేవారు మారి ఇప్పుడు ఏమండోయ్ అనే మాట ఉందా గురువుగారు" అంటూ చంద్రబోస్ గరికపాటికి అడిగారు. "ఇప్పుడూ ఉండి కాకపోతే అటు నుంచి ఇటు అయ్యింది" అంటే భర్తలు భార్యల్ని ఏవండోయ్ అని పిలుస్తున్నారంటూ ఒక చెణుకు విసిరారు. ఇక మరో లేడీ కంటెస్టెంట్ వచ్చి "మా అవని" అంటూ పాడింది. "అవని అనే మాటను నేను సినిమా పాటల్లో ఎక్కడ ఎవరూ ప్రయోగించగా నేను చూడలేదు చాలా అరుదైన మాట." అంటూ చంద్రబోస్ చెప్పారు.

"వేటూరి రాయడం కంటే బాగా చదివారు. అది ఈ పాటలో కనపడుతోంది" అన్నారు గరికపాటి. తర్వాత మరో కంటెస్టెంట్ వచ్చి "ఓ పంకజనాభా" అంటూ ఒక పద్యం పాడింది. "పద్యం అనేది తెలుగు సాహిత్యానికి పరిమితమైన అదొక గొప్ప ప్రక్రియ" అంటూ చంద్రబోస్ చెప్పారు. "ముందుగా పద్యాలు పాడినందుకు నేను నిన్ను అభినందిస్తున్నా. ఎందుకంటే మా కులం వాళ్ళు ఇక్కడొకరు ఉన్నారని అర్ధమయ్యింది. తెలుగు పదాల్లో ఒక అక్షరం కింద అదే ఒత్తు ఉంటుంది. ఐతే మన అక్షరాల కింద మన ఒత్తులే ఎందుకు ఉంటాయండి అని అడిగారు. మనవాళ్లను మనమే తొక్కేయడం మనకు బాగా అలవాటు అని జవాబిచ్చాను" అని చెప్పేసరికి అందరూ పగలబడి నవ్వేశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.