English | Telugu

Eto Vellipoyindhi Manasu : సవతి కొడుకు మీద ప్రేమ ఉంటుందా.. ఆస్తి కోసమే ఇదంతా డ్రామా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -288 లో....మా ఆయన మిమ్మల్ని అంత ప్రేమగా చూసుకుంటే మీరు ఇంత మోసం చేస్తారా అంటూ రామలక్ష్మి అందరిని తిడుతుంది. సందీప్ నా కన్నకొడుకు.. వీడు నా సవతి కొడుకు.. నా కన్నకొడుకు పైనే ప్రేమ చూపిస్తాను. అసలు సీతా అంటేనే నాకు పడదని శ్రీలత అనగానే.. అమ్మ నువ్వేనా ఇలా అంటుంది.. సీతా అన్నయ్యకి ఏ బాధైనా తల్లడిల్లిపోయేదానివి.. నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని సిరి అంటుంది.

ఆ ప్రేమ మొత్తం ఆస్తుల కోసం.. అవే ఇప్పుడు నా చేతికి వచ్చాక. ఇక నటించాల్సిన అవసరం లేదని శ్రీలత అంటుంది. శ్రీలతతో సీతాకాంత్ ఇంకా ప్రేమగా మాట్లాడుతుంటే.. నన్ను అమ్మ అని పిలిచిన ప్రతీసారి తేళ్లు, జెర్రీలు పాకినట్లు ఉంటుందని శ్రీలత అనగానే సీతాకాంత్ బాధపడతాడు. అన్నయ్య లేకుంటే మన పరిస్థితి ఎలా ఉండేది అమ్మ ఇలా మాట్లాడుతున్నావని సిరి అంటుంది. ఒకవైపు శ్రీవల్లి.. మరొకవైపు సందీప్ కలిసి సీతాకాంత్ ని తమ మాటలతో బాధపెడతారు. ఇంట్లో నుండి వెళ్ళిపోతారా.. బయటకు గెంటేయ్యమంటారా అని శ్రీవల్లి అంటుంది. ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి రామలక్ష్మి, సీతాకాంత్ లు నిర్ణయం తీసుకొని బయటకు వస్తుంటే.. నేను మీతో వస్తాను అన్నయ్య అని సిరి అంటుంది. వద్దని సీతాకాంత్ అంటాడు.

ఆ తర్వాత డబ్బు కోసమే నన్ను ప్రేమించావా అంటూ ధన పైన సిరి కోప్పడుతుంది. ఆ తర్వాత నేను ఒకటి మర్చిపోయానంటూ రామలక్ష్మి లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావ్ డబ్బు కావాలా అంటూ తనని అవమానిస్తారు. జల్సాలకి అలవాటు పడ్డ వీడి చేతిలో ఆస్తులు పెట్టావ్.. మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే టైమ్ వస్తుందని రామలక్ష్మి అంటుంది. మీరే నా అవసరం కోసం వస్తారని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.