English | Telugu

ఢీ సీజన్ 20 త్వరలో

బుల్లితెర మీద ఫేమస్ ఢీ డాన్స్ షో సీజన్ 20 త్వరలో మొదలుకాబోతోంది. ఐతే ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’ కొత్త సీజన్ మొదలవ్వనుంది. ఈ కొత్త సీజన్ కి కూడా యాంకర్ గా నందు వచ్చాడు. ఐతే జడ్జెస్ గా విజయ్ బిన్నీ మాష్టర్ రాగా లేడీ జడ్జ్ గా రెజీనా కసాండ్ర రాబోతోంది. తాజాగా ఈ ఢీ న్యూ సీజన్ గ్రాండ్ లాంచో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్స్ ప్రతీ బుధవారం, గురువారం రాత్రి 9 .30 కి ప్రసారం కాబోతోంది. ఇక ఢీ హిస్టరీలో కొన్ని మైల్ స్టోన్స్ ఉండబోతున్నాయన్న విషయం తెలుస్తోంది. పల్సర్ బైక్ ఝాన్సీ, మణికంఠ, జానూ లిరి, అభి మాష్టర్, సుస్మిత ఆనాల, జతిన్, రాజు, పండు మాష్టర్, భూమిక, అన్షు రెడ్డి ఉండబోతున్నారు. అలాగే శ్రీవాణి కూతురు రాజనందిని కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతోంది. విక్రమాదిత్య వచ్చి కూతురి కాళ్లకు నల్ల తాడు కట్టాడు. జాను లిరి వాళ్ళ అబ్బాయి కూడా స్టేజి మీదకు వచ్చాడు.

ఢీ 20 ఇది సార్ మా బ్రాండ్ అనే టైటిల్ తో ఈ న్యూ ఎపిసోడ్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక నెటిజన్స్ ఐతే వస్తున్న డాన్స్ మాష్టర్లు పేర్లు మెన్షన్ చేస్తూ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఐతే ఈ మెగా లంచ్ ఎప్పుడు ఉండబోతోంది ఎవరు లాంచ్ చేయబోతున్నారు అన్న డీటెయిల్స్ ని ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచారు మేకర్స్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.