English | Telugu

Brahmamudi : రాజ్ ప్లాన్ ఫెయిల్.. కావ్య ఏం చేయనుంది!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -850 లో.....స్వప్న ఫోన్ కి కనకం ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది. అసలు అక్కడ ఏం జరిగిందని కనకం అడుగుతుంది. నీ కూతురు తప్పు చేసి అక్కడకి వచ్చింది.. ఏం చెప్పలేదా అని రుద్రాణి అంటుంది. అప్పుడే స్వప్న వచ్చి ఫోన్ లాక్కొని వేరొకరి ఫోన్ లిఫ్ట్ చెయ్యకూడదని జ్ఞానం కూడా లేదా అని రుద్రాణిని స్వప్న తిడుతుంది.

మరొకవైపు అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎలా కనుక్కోవాలని కనకం ఆలోచిస్తుంటే.. అప్పుడే ఇందిరాదేవి, అపర్ణ ఎంట్రీ ఇస్తారు. అసలు ఏం జరిగిందని వాళ్ళని కనకం అడుగుతుంది. నీకేం చెప్పలేదా అయితే మాకు తెలియదని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. ఇద్దరు కావ్య దగ్గరికి వెళ్లి ఐడియా చాలా బాగుంది.. నువ్వు రాసిన లెటర్ చూసి నేను షాక్ అయ్యాను.. ఇదంతా యాక్టింగ్ అని నాకు తెలుసని అపర్ణ అంటుంది. ఇది యాక్టింగ్ కాదు నిజంగానే ఇంట్లో నుండి వచ్చేసానని కావ్య అంటుంది. అసలు ఏం జరిగిందని కనకం అనగానే.. నా కొడుకు దాన్ని అబార్షన్ చేసుకొమ్మంటున్నాడని అపర్ణ చెప్పగానే కనకం షాక్ అవుతుంది. అలా ఎలా చేయించుకుంటుందని కనకం బాధపడుతుంది. సరే గాని ఆకలిగా ఉందని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు కావ్యని ఎలా రప్పించాలని ప్లాన్ చేస్తాడు రాజ్. కావ్యకి రాజ్ ఫోన్ చేసి.. ఇక్కడ మా మమ్మీ బాలేదు.. నానమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్తాడు. రాజ్ తో కావ్య మాట్లాడుతూ మరొక వైపు అపర్ణ, ఇందిరాదేవికి భోజనం వడ్డీస్తుంది. ఒకసారి వీడియో కాల్ చేయండి అమ్మమ్మ ని చూడాలని కావ్య అంటుంది. రాజ్ కి కావ్య వీడియో కాల్ చేసి ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరికి చూపిస్తుంది. నాది నాకే రివర్స్ అయింది కదా ఏదో ఫ్రాంక్ చేసానని రాజ్ కవర్ చేస్తాడు.

మరొకవైపు కావ్య ఈ ఇంటిపరువు తీసేల చేస్తుందని చెప్పి ఇంట్లో వాళ్ళని నమ్మించాలని రుద్రాణి, రాహుల్ ప్లాన్ చేస్తారు. మరొకవైపు కావ్య జరుగుతున్న దాని గురించి బాధపడుతుంటే.. అప్పుడే కృష్ణమూర్తి వచ్చి కావ్యతో మాట్లాడుతాడు. తరువాయి భాగం లో మీడియా వాళ్ళు కావ్య దగ్గరికి వచ్చి మీ భర్త మీ కడుపులో బిడ్డ ని వద్దనుకుంటున్నాడంట ఎందుకని అడుగుతారు. అదంతా దుగ్గిరాల కుటుంబం టీవీలో చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.