English | Telugu

Brahmamudi: బిడ్డ కోసం భర్తని వదులుకోవడానికి భార్య సిద్ధం.. సూపర్ ట్విస్ట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -843 లో... రాజ్ పై కావ్య కోప్పడుతుంది. రాజ్ జ్యూస్ లో టాబ్లెట్ కలిపాడని చెప్పబోతు ఆగిపోతుంది. ఏంటి ఆగిపోయావ్ నేను నిజంగానే జ్యూస్ లో టాబ్లెట్ కలిపాను.. ఇప్పుడు ఏం చేస్తావని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు.

నేను నీ భర్తగా చెప్తున్నాను.. నువ్వు ఆపరేషన్ కి ఒప్పుకోమని రాజ్ అంటాడు. మీరు ఏ అధికారంతో నా బిడ్డని వద్దని అంటున్నారు. మీకు ఈ బిడ్డ అడ్డు అయితే నేను మిమ్మల్ని వదిలేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కావ్య అంటుంది. నాకు మీరు అవసరం లేదని కావ్య మాట్లాడుతుంటే అందరు షాక్ అవుతారు.

ఆ తర్వాత నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావు.. రాజ్ అంటే ఎంత ఇష్టం.. వాడిని వదిలేసి విడాకులు ఇస్తా అంటున్నావేంటని కావ్యతో అపర్ణ అంటుంది. ఆయనని విడిచి నేను ఉండలేను.. ఏదో బెదిరిస్తున్నా అంతే.. అప్పుడయినా నిజం చెప్తాడని అని కావ్య అంటుంది. ఆ తర్వాత అప్పు ఏడుస్తూ ఇదంతా మనవల్లే అని కళ్యాణ్ తో అంటుంది.

మరొకవైపు కోడలు గురించి సుభాష్ ఆలోచిస్తాడు. తనకి చెస్ట్ లో పెయిన్ గా ఉంటే అపర్ణ వచ్చి టాబ్లెట్ ఇస్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి అప్పు వచ్చి.. ఎందుకు విడాకులు ఇస్తానంటున్నావని అడుగతుంది. ఇదంతా నాటకమని అప్పుకి కూడా తెలియొద్దని కావ్య అనుకుంటుంది.

తరువాయి భాగంలో అప్పు భోజనం చెయ్యడానికి రాదు.. కావ్య తిట్టింది అందుకే రావట్లేదని రుద్రాణి అనగానే కావ్యని ధాన్యలక్ష్మి తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.