English | Telugu

మొదటి వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే!

బిగ్ బాస్ మొదటి వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది . ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో భరణి, ఇమ్మాన్యుయల్ ఇద్దరు ఉండగా భరణి సుత్తిని ముందుగా పట్టుకున్నాడు. దాంతో తను సంజనని నామినేట్ చేసి సుత్తిని శ్రీజకి ఇస్తాడు కానీ శ్రీజ సంజనని కాకుండా తనూజని నామినేట్ చేస్తుంది. నువ్వేం చేసిన యాక్టింగ్ చేసినట్లనిపిస్తుందని తనూజతో శ్రీజ అంటుంది. అలా తనూజ గురించి ఓనర్స్ అందరు ఒక్కొక్కరుగా పాయింట్స్ చెప్తారు. ఎవరైన అన్నం పెడుతుంటే అన్నపూర్ణలాగా ఉండాలి.. ఏదో చేస్తేస్తున్న ఇష్టం ఉంటే తినండి అన్నట్లు ఉంటుంది నీ బిహేవియర్ అని హరీష్ అనగానే తనూజ హర్ట్ అవుతుంది. మీ బాడీ లాంగ్వేజ్ బాలేదంటు మాస్క్ మెన్ హరీష్ అన్నాడు.

ఒక అమ్మాయి బిహేవియర్ పై అలా అనడం కరెక్ట్ కాదని తనూజ పక్కకి వచ్చి ఏడుస్తుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి, ఫ్లోరా సైని వంతు రాగ సుమన్ శెట్టి సుత్తి తీసుకుంటాడు. తను మొదటగా సంజనని నామినేట్ చేస్తాడు. సుత్తి తీసుకొని ప్రియకి ఇస్తాడు. ప్రియ రాముని నామినేట్ చేస్తుంది. రెంటర్స్ లో భరణిని మాత్రమే ఎవరు నామినెటే చెయ్యలేదు. దాంతో బిగ్ బాస్ అతనికి ఒక పవర్ ఇస్తాడు. ఓనర్స్ లో సుత్తి తీసుకొని వాళ్ళు ఇద్దరున్నారు. ఒకరు మనీష్ ఇంకొకరు డీమాన్ పవన్ వారిలో ఒకరిని డైరెక్ట్ నామినేషన్ లోకి తీసుకోనే వచ్చే ఛాన్స్ భరణికి వచ్చింది.

డీమాన్ పవన్ ని భరణి డైరెక్ట్ నామినేట్ చేస్తాడు. దీంతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇక మొత్తం నామినేషన్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సంజన, ఫ్లోరా సెని, సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనూజ, రీతూ చౌదరి, శ్రష్టి, ఇమ్మాన్యుయల్, ఓనర్స్ లో డీమాన్ పవన్ ఉన్నాడు. మరి వీరిలో మీ ఓట్ ఎవరికి.. ఎవరిని హౌస్ నుండి బయటకి పంపించాలనుకుంటున్నారు కామెంట్ చేయండి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.