English | Telugu

నబీల్ వన్ మ్యాన్ షో.. అటు హౌస్ మేట్స్, ఇటు ఆడియన్స్ ఫిధా!

బిగ్ బాస్ హౌస్ లో ఎవరి ఊహకి అందకుండా కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ ఒక్కో కంటెస్టెంట్ యొక్క నేచర్ బయటకొస్తుంది‌.‌ మొదట్లో గంభీరంగా, స్టిక్ట్ గా ఉన్న నిఖిల్ ఇప్పుడు సోనియా మాయలో పడిపోయాడు.

ఇక ఫస్ట్ టూ వీక్స్ అసలు నబీల్ ఉన్నాడో లేదా అనిపించింది కానీ ఎప్పుడైతే తనలో ఫైర్ లేదని , వాయిస్ వినిపించడం లేదని నామినేషన్ లో అన్నారో.. అప్పటి నుంటి నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్‌ లో నబీల్ హవా కొనసాగింది. బిగ్‌బాస్ గోల్డెన్ బ్యాండ్ అంటూ ఓ స్పెషల్ ఐటెమ్‌ను కంటెస్టెంట్లకి చూపించాడు. దానికి స్పెషల్ పవర్స్ ఉంటాయని చెప్పినా సరే కంటెస్టెంట్లు ఎవరూ తీసుకోలేదు. కానీ మణికంఠ మాత్రం తెలివిగా దాన్ని అందుకున్నాడు. అయితే మణికంఠ తీసుకున్న తర్వాతే దాని పవర్ ఏంటో అందరికీ అర్థమైంది. ఆ గోల్డెన్ బ్యాండ్‌తో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్లు అందరూ వేరే సభ్యుల్ని ఇమిటేట్ చేస్తూ నటించమని చెప్పాడు. ఇందులో అందరికంటే నబీల్ మాత్రం ఇరగదీశాడు. ఆదిత్యను అద్భుతంగా ఇమిటేట్ చేశాడు.

ఇక పృథ్వీ, విష్ణుప్రియ లాగా నిఖిల్ అండ్ కిర్రాక్ సీత నటించారు. అలాగే మణికంఠ లాగా ప్రేరణ చక్కగా చేసింది. ఇక హౌస్ లో ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి వాటిని ఇరు టీమ్ లు గెస్ చేసి ఆర్డర్ లో రాయాలి. అందులో శక్తి టీమ్ కు రెండు పాయింట్లు, కాంతారా టీమ్ కి ఒక్క పాయింట్ వచ్చింది‌. ఇక ఈ టాస్క్ కి సంఛాలక్ గా నబీల్ ఉన్నాడు. ఇక‌ నిన్నటి ఎపిసోడ్ లో నబీల్ ది వన్ మ్యాన్ షో అని చెప్పాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.