English | Telugu

బిగ్ బాస్ అగ్ని పరీక్ష... అభిజిత్ ఫోటోని కాల్చేసిన దివ్య

బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొదలైపోయింది. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు. మొదటిగా బెజవాడ నుంచి దివ్య ఎంట్రీ ఇచ్చిది. డాక్టర్ చదువుతోంది. ఒక్కో జడ్జ్ ఒక్కో ప్రశ్న అడిగారు. " ఇక్కడ నలుగురు బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో ఒకరు బెస్ట్ ఎవరు వరస్ట్ ఎవరో చెప్పాలి" అని అభిజిత్ అడిగాడు. వెంటనే దివ్య... "నేను బిగ్ బాస్ సీజన్ 1 లో నవదీప్ అంటే నాకు ఇష్టం. నవ్వించడం ఒక ఆర్ట్. స్పాంటేనియస్ గా నవ్వించడం ఎవరూ చేయలేని పని ఇక వరస్ట్ అంటే అభిజిత్" అని చెప్పింది దివ్య. దానికి అభిజిత్ ఫీల్ కాకుండా అది నీ అభిప్రాయం అని అన్నాడు. తర్వాత శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తున్నాను..అభిజిత్ అంటే ఇష్టం లేదు అన్నావ్ కాబట్టి ఎలా నామినేట్ చేస్తావో చెప్పు అంది శ్రీముఖి. "బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ అభిజిత్ . చూడడానికి బాగుంటారు. టాస్కులు అన్ని ఆడాలి. సోఫాలో కూర్చుని మైండ్ గేమ్స్ ఆడేసి గెలిచేసాను అంటే ఒప్పుకోను నిజానికి ఆయన ఫోకస్ అంతా గేమ్ మీద కంటే మిగతా కంటెస్టెంట్స్ మీదనే ఉందని నాకు అనిపించింది. గేమ్ ని రెస్పెక్ట్ చేయనివాళ్లను నేను నామినేట్ చేస్తా" అని చెప్పి అభిజిత్ ఫోటోని కాల్చేసింది.

"సారీ కానీ థ్యాంక్యూ అని ఏమన్నా చెప్తావా"అని శ్రీముఖి అడిగేసరికి "నామినేషన్స్ లో సారీ కానీ థ్యాంక్యూ కానీ ఏమీ ఉండవు కదా" అంది దివ్య. తర్వాత అభిజిత్ ని దివ్య ముందు నిలబెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి "నాకు నీ గేమ్ నచ్చలేదు అని చెప్పు" అంది శ్రీముఖి. "ఒక్క గేమ్ కూడా నాకు నచ్చలేదు. ఒక్క ఫిజికల్ టాస్క్ లో కూడా మీరు గెలిచినట్టు కనిపించలేదు. అలా అని ఫిజికల్ టాస్క్స్ మాత్రమే బిగ్ బాస్ కాదు." అని చెప్పింది. "ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కామనర్స్ గెలుస్తారు సెలబ్రిటీస్ గెలుస్తారా" అని శ్రీముఖి అడిగింది. "సెలబ్రిటీ కంటే కామన్ వాళ్లకు బెటర్ ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే సెలబ్రిటీస్ కి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఓపెనప్ కాలేరు. కానీ కామన్ పీపుల్ కి ఆ భయం ఉండదు." అని చెప్పింది దివ్య. ఇక అభిజిత్ జనాలు మీ మాటను కూడా అంగీకరిస్తారేమో చూద్దాం అని వెళ్లి కూర్చున్నాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.