English | Telugu

పెళ్ళాం చెబితే వినాలి..

చాలా కుటుంబాల్లో భార్యభర్తలు ఒకరికి ఒకరు ఎప్పుడూ సలహాలు ఇచ్చుకోరు. అందులోనూ భార్యల మాటల్ని కానీ సలహాలను కానీ భర్తలు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే ఒకరి సలహాలు మరొకరు విని ఆచితూచి అడుగు వేస్తారో వాళ్ళు లైఫ్ లో పెద్దగా నష్టపోరు...ఇప్పుడు ఆది రెడ్డి కూడా అదే చెప్పాడు. బెట్టింగ్ యాప్స్ విషయంలో ఇప్పుడు ఆది రెడ్డికి, నా అన్వేషణకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ టైములో ఆది ఈ వీడియోని పోస్ట్ చేసాడు.

"నా పెళ్ళై ఐదేళ్లు అయ్యింది. ఈ టైంలో ఆది ఇది చేయొద్దు...నీకు నెగటివ్ అవ్వొచ్చు..లాస్ రావొచ్చు...అని చెప్పేది. కానీ నేను ఆమె మాట వినలేదు. దాంతో లాస్ వచ్చింది. దాంతో నేను కొన్ని నెలల క్రితం నేను ఒకటి డిసైడ్ అయ్యాను. భార్య మాట వినాలి ఎందుకంటే మనం టెన్షన్స్ లో డెసిషన్స్ తీసేసుకుంటాం కానీ భార్య మాత్రం భర్త చెడును కోరుకోదు. అందుకే ఆలోచించి భర్త బాగుండాలని కోరుకుంటూ సలహాలు ఇస్తే మనం మాత్రం అన్నీ మనకే తెలుసులే అని లైట్ తీసుకుంటాం. ఆ తరువాత దెబ్బ పడినప్పుడు, లాస్ వచ్చినప్పుడు, నెగటివ్ ఐనప్పుడు అర్ధమవుతుంది. కాబట్టి భార్యల మాటలు వింటే కచ్చితంగా మంచే జరుగుద్ది..అలాగే నా వైఫ్ చెప్పింది ఒక్కటే ఎవరో ఏదో అన్నారని రియాక్ట్ అవ్వొద్దు...ఏదైనా ఉంటే లీగల్ గా వెళ్ళు అని చెప్పింది ఇప్పుడు అదే చేస్తున్నా. నేను ఎప్పుడూ చట్టవిరుద్ధమైన యాప్స్ ని, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదు ..ఇక ముందు కూడా చేయను." అని చెప్పాడు ఆది రెడ్డి.

అలాగే టెలిగ్రామ్ యాప్ లో తన పేరుతో బెట్టింగ్ యాప్స్ నడుస్తున్నాయని దానికి తనకి ఎలాంటి సంబంధం లేదు అంటూ లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు ఆది రెడ్డి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.