English | Telugu

శ్రీముఖి కన్నా ఎక్కువ సంపాదించేవాళ్ళు లేరమ్మా...వంటొచ్చిన వాళ్ళు కావాలి

ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో సకుటుంబ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు..దానికి సంబందించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షో మొత్తంలో శ్రీముఖి పెళ్లి కాన్సెప్ట్ తోనే లింక్ ఐనట్టు తెలుస్తోంది. శ్రీముఖికి వాళ్ళ నానమ్మ ఈ షోకి వచ్చింది. ఇక శ్రీముఖి చిత్రంతో ఒక బోర్డుని స్టేజి మీద ఏర్పాటు చేసారు. ఇక హరి శ్రీముఖికి కావాల్సిన పెళ్లికొడుకులో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో, మీకు ఎలాంటి మనవడు కావాలో చెప్తే మేం రాస్తాం అంటూ నానమ్మని అడిగాడు. ఆమె చాలా కండిషన్స్ చెప్పింది. "బుద్ది, గుణం బాగుండాలి" అని చెప్పింది. "సంపాదన ఎంత ఉండాలి" అని అవినాష్ అడిగాడు. "శ్రీముఖి కంటే ఎక్కువనే ఉండాలి" అని చెప్పింది.


"శ్రీముఖి కన్నా ఎక్కువ సంపాదించేవాళ్ళు లేరమ్మా" అన్నాడు హరి. "ఆమె అడిగింది పెట్టాలి, ఆమెకు టమాటో ముక్కాలా కూర, రోటి పచ్చడి, చిక్కుడుకాయ, మామిడి పచ్చడి" అనేసరికి "ఎందుకు కర్రీ పాయింట్ పెట్టుకుంటుందా" అంటూ అవినాష్ అడిగాడు. "అంటే శ్రీముఖి అడిగిందల్లా వండి పెట్టాలంటారు అంతేనా" అని అడిగి బోర్డు మీద "వంట మనిషి కావాలి" అని రాసాడు. "ఒరేయ్ వంట మనిషి కాదురా వంట వచ్చిన మనిషి కావాలి" అని రాయాలి అని సరి చేసింది శ్రీముఖి. "సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావాలా బయట వాళ్ళు కావాలా" అని అవినాష్ అడిగాడు. "ఇప్పుడు హీరోలందరికీ పెళ్లిళ్లయిపోయాయి కదా" అని నానమ్మ అంటే "అవును హీరో రామ్ చరణ్, మహేష్ బాబుకు ఐపోయింది" అని శ్రీముఖి అనేసరికి హరి, అవినాష్ వామ్మో అంటూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. "నానమ్మ ఈ గ్యాప్ లో బోర్డు మీద ఇంకో పాయింట్ రాసాడు. ఓవరాల్ గా అవినాష్ లా ఉండాలి" అని రాసేసరికి "నీలాంటోళ్ళు అసలు వద్దు" అని అవినాష్ ముఖమ్మీదే చెప్పేసింది నానమ్మ. దాంతో శ్రీముఖి నవ్వేసింది.



Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.