Eto Vellipoyindhi Manasu : వెంచర్ పై తన పేరు చూసి సీతాకాంత్ షాక్.. రామలక్ష్మి ఏం చేయనుంది?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -297 లో....శ్రీవల్లి, శ్రీలతకి కాఫీ తీసుకొని వచ్చి ఇద్దరికి షేర్ చేస్తుంది. ఎందుకు అలా చేస్తున్నావని శ్రీలత అడుగగా.. ఇంట్లో పాల ప్యాకెట్ లేదు.. పైగా డబ్బులు కూడా లేవని అంటుంది. రాను రాను మన పరిస్థితి ఏంటోనని శ్రీవల్లి అంటుంది. అప్పుడే సందీప్, ధన లు వచ్చి ఇంట్లో అందరిని పిలుస్తారు. మేము సంపాదించలేమన్నారు కదా.. మా తెలివితో ఎంత సంపాదించామోనని సందీప్, ధనలు గొప్పగా చెప్తూ డబ్బు చూపిస్తారు.