English | Telugu

Karthika Deepam2 : తెలివిగా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన జ్యోత్స్న.. శౌర్య కోసం ఎమోషనల్ అయిన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -262 లో.....పోలీసుల ఎంక్వయిరీ లో నేనే దాస్ ని కొట్టానని తెలుస్తుందా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అప్పుడే పోలీసులు ఇంటికి వస్తారు. దాంతో జ్యోత్స్న టెన్షన్ మరింత పెరుగుతుంది. దాస్ గురించి కంప్లైంట్ ఇచ్చారు కదా అని ఇన్‌స్పెక్టర్ అనగానే.. అవును వాడు నా కొడుకు అని పారిజాతం అంటుంది. తనకి అయిన దెబ్బలు చూస్తుంటే అవి ఆక్సిడెంట్ అయిన దెబ్బలు లాగా లేవు.. ఎవరో బలవంతం గా కొట్టినట్లు ఉందని ఇన్‌స్పెక్టర్ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తన ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేస్తే చివరగా ఇక్కడ చూపించింది. తర్వాత సిగ్నల్ చూపించలేదని ఇన్‌స్పెక్టర్ అంటాడు.

Brahmamudi : భార్యని అర్థం చేసుకున్న భర్త.. ఇదే కదా సరికొత్త బ్రహ్మముడి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -626 లో.... రుద్రాణి ధాన్యలక్ష్మి లు గెస్ట్ హౌస్ తాకట్టు గురించి అడుగగా.. వచ్చాక చెప్తామని వాళ్ళతో రాజ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. ఇక రాజ్ , కావ్య నందగోపాల్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అక్కడున్న రౌడీలని కావ్య తన ఎమోషనల్ మాటలతో గొడవ చేయకుండా ఆపుతుంది. వాళ్లు ఆగితే ఏంటి నేనున్నాను కదా అంటూ నందగోపాల్ రాజ్ ని కొట్టబోతాడు. దాంతో రాజ్ వాడిని కొడతాడు బయటకు పరిగెడుతుంటే చుట్టూ పోలీసులు వచ్చి చేరుతారు. నంద గోపాల్ కి తప్పించుకునే ఛాన్స్ ఉండదు.

Eto Vellipoyindhi Manasu : మూడు రోజుల టైమ్ ఇచ్చిన పోలీసులు.. మోసం చేయలేదని సీతాకాంత్ నిరూపిస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -308 లో...... మాణిక్యం వచ్చి ఆఫీస్ దగ్గర అందరు గొడవ చేస్తున్నారని చెప్పడం తో రామలక్ష్మి, మాణిక్యం సీతాకాంత్ లు ఆఫీస్ కి బయల్దేర్తారు. అప్పుడే రామలక్ష్మి కి శ్రీలత ఫోన్ చేస్తుంది. జరుగుతున్న దానికి తనకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది లిఫ్ట్ చేసి మాట్లాడమని మాణిక్యం అంటాడు. దాంతో రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఇదంతా కావాలని మీరే చేయించారా అని రామలక్ష్మి అడుగగా.. మరి లేనిది ఉన్నట్టు ఎలా అవుతుంది. అంతా నేనే చేశానని శ్రీలత అంటుంది.

Illu illalu pillalu : రామరాజుకి ఎదురుతిరిగిన కొడుకు.. వాడిని చంపడానికి విశ్వ స్కెచ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -61 లో..... నీ ముద్దుల కొడుకు వల్ల నలుగురిలో పరువు పోయిందని రామరాజు అంటుంటే ధీరజ్ మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దాంతో మాట్లాడకని రామరాజు అనగానే.. నేను మాట్లాడతాను నాన్న.. నలుగురు ఏం అనుకుంటారో అంటున్నారు. ఎవరు ఆ నలుగురు ఇరవై అయిదు సంవత్సరాల క్రితం మీరు అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ నలుగురు మీకు సాయంగా ఉండి.. ఒక పూట భోజనం పెట్టారా.. ఎందుకు నలుగురి గురించి అలోచించడం అని ధీరజ్ అంటుంటే.. రామరాజుకి ఇంకా కోపం వస్తుంది.

Karthika Deepam2 : కన్నతండ్రినే చంపాలనుకున్న జ్యోత్స్న.. అతనిది యాక్సిడెంట్ కాదని డౌట్ పడ్డ దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -260 లో..... దాస్ ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వస్తారు. ఆ సిచువేషన్ లో దాస్ ని చూసి పారిజాతం ఎమోషనల్ అవుతుంది. నిన్ను ఎవరు కొట్టారో వాళ్ళ చేతులు విరిగిపోను అంటూ పారిజాతం తిడుతుంటే జ్యోత్స్న రియాక్ట్ అవుతుంది. తమలో ఇలాంటి ప్రేమలు కూడా ఉన్నాయా అని జ్యోత్స్నని ఉద్దేశించి కార్తీక్ అంటాడు. మీరు వెళ్ళండి నేను ఉంటానని జ్యోత్స్న అందరిని బయటకు పంపిస్తుంది. మీ నాన్న అంటే ఎంత ప్రేమనే అని పారిజాతం అనుకుంటుంది. అందరిని వెళ్ళమని చెప్పింది నిన్ను చంపెయ్యడానికే అని జ్యోత్స్న అనుకుంటుంది.

Eto Vellipoyindhi Manasu : కొత్త వ్యక్తితో కలిసి శ్రీలత మాస్టర్ ప్లాన్.. టీవీలో వచ్చింది చూసి వాళ్ళిద్దరు షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -307 లో... రామలక్ష్మి ఆకలి అంటూ గట్టిగా అరుస్తుంటాడు సీతాకాంత్. అప్పుడే రామలక్ష్మి భోజనం తీసుకొని వస్తుంది. బాగుందంటూ సీతాకాంత్ ఫాస్ట్ గా తింటుంటే మెల్లగా తినండి అంటుంది రామలక్ష్మి. మీరు ఎక్కడున్నా రాజే అండి అని పెద్దావిడ అన్న మాటలు గుర్తుచేస్తుంది రామలక్ష్మి. నువ్వు నా పక్కన ఉంటేనే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. నన్ను గొప్పగా చేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకని సీతాకాంత్ అంటాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటారు.

Brahmamudi : కావ్య గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం చెప్పేసిన ధాన్యలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -624 లో.....ఇంట్లో ఏం జరుగుతుంది. మీకు వచ్చిన సమస్య గురించి చెప్పమని అపర్ణ అడిగితే కావ్య చెప్పదు. దాంతో అపర్ణ కావ్యతో మాట్లాడడం మానేస్తుంది. కావ్య కాఫీ తీసుకొని వచ్చినా కూడా అపర్ణ తీసుకోదు. అప్పుడే రాజ్ వస్తాడు. మీకు దమ్ముంటే ఈ కాఫీ తీసుకొని వెళ్లి అత్తయ్యకి ఇవ్వండి అని అంటుంది. రాజ్ కాఫీ తీసుకొని అపర్ణ గదిలోకి వెళ్తాడు. కాసేపటికి కాఫీ కప్ పగిలిన సౌండ్ ఇంకా రాజ్ చెంప చెల్లుమనిపించిన సౌండ్ వస్తుంది. ఇక రాజ్ బయటకి వచ్చి ఏదో కవర్ చేస్తాడు. ఈసారి కావ్య వెళ్లి ఇస్తుందని రాజ్ అంటాడు.

Eto Vellipoyindhi Manasu : భద్రం మోసగాడని తెలుసుకున్న శ్రీలత... సొల్యూషన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -306 లో.....  భద్రం చేసిన మోసాన్ని శ్రీలత వాళ్ళకి చెప్తుంది రామలక్ష్మి. వాడొక పెద్ద ఫ్రాడ్.. వాడిని నమ్మి మోసపోయారని రామలక్ష్మి చెప్తుంది. రేపటి వరకు అందరి డబ్బు ఇవ్వకపోతే అందరిని తీసుకొని వచ్చి గొడవ పెడతానంటూ రామలక్ష్మి అందరికి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు మురళి దగ్గరికి సీతాకాంత్ వెళ్లి భద్రం పెద్ద మోసగాడు.. కావాలంటే టెస్ట్ చెయ్యండి.. ఇప్పుడు పెట్టే పెట్టుబడి మొత్తం బ్యాంకు ట్రాన్సక్షన్స్ కావాలని అనండి అని సీతాకాంత్ చెప్పగానే..  భద్రంకి మురళి ఫోన్ చేసి అలాగే ట్రాన్సక్షన్స్ కావాలని అంటాడు. దానికి భద్రం సరే అంటాడు.