English | Telugu

Brahmamudi : కావ్య గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం చెప్పేసిన ధాన్యలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -624 లో.....ఇంట్లో ఏం జరుగుతుంది. మీకు వచ్చిన సమస్య గురించి చెప్పమని అపర్ణ అడిగితే కావ్య చెప్పదు. దాంతో అపర్ణ కావ్యతో మాట్లాడడం మానేస్తుంది. కావ్య కాఫీ తీసుకొని వచ్చినా కూడా అపర్ణ తీసుకోదు. అప్పుడే రాజ్ వస్తాడు. మీకు దమ్ముంటే ఈ కాఫీ తీసుకొని వెళ్లి అత్తయ్యకి ఇవ్వండి అని అంటుంది. రాజ్ కాఫీ తీసుకొని అపర్ణ గదిలోకి వెళ్తాడు. కాసేపటికి కాఫీ కప్ పగిలిన సౌండ్ ఇంకా రాజ్ చెంప చెల్లుమనిపించిన సౌండ్ వస్తుంది. ఇక రాజ్ బయటకి వచ్చి ఏదో కవర్ చేస్తాడు. ఈసారి కావ్య వెళ్లి ఇస్తుందని రాజ్ అంటాడు.

రాజ్ ఏదో సౌండ్ వచ్చిందని ఇందిరాదేవి అనగానే రాజ్ డైవర్ట్ చేసీ.. కాఫీ చేస్తున్న కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య, రాజ్ లు కాఫీ తీసుకొని బయట కూర్చొని ఉన్న అపర్ణ దగ్గరికి వచ్చి తన కాళ్ళ మీద పడి.. ఒకరికి మించి ఒకరు వాళ్ళ కవిత్వంతో పోటీపడుతూ అపర్ణని రిక్వెస్ట్ చేసి పైకి చూసేసరికి.. టీ తాగుతూ ఇందిరాదేవి ఉంటుంది. మమ్మీ ఎక్కడ అని రాజ్ అడుగగా.. ఎప్పుడో వెళ్ళిపోయిందని ఇందిరాదేవి చెప్తుంది. దాంతో ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దొంగ సామంత్ పర్సు దొంగతనం చేయబోతుంటాడు. అప్పు చూసి ఆపుతుంది. సామంత్ ని చూసి ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడే అనామిక వచ్చి.. ఏం పని లేక ఇలా దొంగలని పట్టుకుంటున్నారన్నమాట ఎంత తీసుకుంటున్నారు అంటూ తక్కువ చేసి మాట్లాడుతుంది. నా అప్పు త్వరలోనే పోలీస్ కాబోతుందని కళ్యాణ్ చెప్పగానే.. జోక్ బాగుంది అంటూ అనాకిక నవ్వుతుంది. త్వరలోనే అప్పుని పోలీస్ డ్రెస్ లో చూస్తావని కళ్యాణ్ చెప్పి అప్పుని తీసుకొని వెళ్లిపోతాడు. నిజంగానే పోలీస్ అవుతుందా.. ఆ కావ్య, రాజ్ పై పోకస్ చేసి వీళ్ళ గురించి మర్చిపోయానని అనామిక అనుకుంటుంది.

మరోవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వస్తుంది. కావ్య గెస్ట్ హౌస్ ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందన్న విషయం చెప్తూ.. వీళ్ళు ఆస్తులు కాదు అప్పులు వాటాలు ఇచ్చేలా ఉన్నారంటూ రుద్రాణి రెచ్చగొడుతుంది. దాంతో విషయం ఏంటో తేలుస్తానని ధాన్యలక్ష్మి అంటుంది. రాజ్ రెడీ అవుతుంటే.. ఇంకా రెడీ అవ్వలేదా ఎన్ని పనులు చేసి నేను ఎలా రెడీ అయ్యానంటూ రాజ్ కు కావ్య సూట్ తోడిగిస్తూ అంటుంటే.. నిన్ను చూస్తే ఒక మాట అనాలనిపిస్తుందని రాజ్ అనగా.. ఏంటని కావ్య అడుగుతుంది. మేడం సర్ మేడం అంతే అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం ధాన్యలక్ష్మి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.