English | Telugu

ఈ వయసులో కిస్సులు, హగ్గులు ఏంటి రష్మీ...

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రామ్ ప్రసాద్ కిస్సులు, హగ్గులు అంటూ సరదాగా నవ్వించాడు. రాంప్రసాద్, దొరబాబు, శాంతిస్వరూప్ కలిసి ఒక స్కిట్ వేశారు. రాంప్రసాద్ కుర్చీలో ఊగుతూ దొరబాబుతో వార్తలు చదివించుకుంటూ ఉంటాడు. అందులో హెడ్ లైన్ గా "కిస్సులకు, హగ్గులకు ఒకే అన్న రష్మీ" అని చదువుతాడు. ఎవరైనా ఆ మాట వింటే సీరియస్ అవుతారు. కానీ రష్మీ మాత్రం సింపుల్ గా నవ్వుతూ "ఇది ఎప్పుడో అన్నాను నేను" అనేసరికి రాంప్రసాద్, దొరబాబు షాకై చూస్తూ ఉంటారు. "నీకు అభ్యంతరం లేకపోతే చూడడానికి మాకు ఉండాలి కదా అభ్యంతరం..ఈ వయసులో కిస్సులు, హగ్గులు బాగోవు కదా" అన్నాడు రాంప్రసాద్..ఆ మాటకు రష్మీ షాకయ్యింది.

అమరదీప్-తేజస్విని ఫ్యూచర్ ఏఐ రూపంలో ఇలా...

అమరదీప్ - తేజస్విని గౌడ బుల్లి తెర మీద సీరియల్స్ ద్వారా షోస్, ఈవెంట్స్ ద్వారా ఆడియన్స్ పరిచయమే. అలాంటి తేజు రీసెంట్ గా కాకమ్మ కథలు షోకి గెస్ట్ గా వచ్చింది. అందులో ఆమె ఎన్నో విషయాలను చెప్పింది. "నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాక అనుకోకుండా నేను ఇండస్ట్రీకి వచ్చాను. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లు అయ్యింది. నిజంగా నేను చాలా లక్కీ నా గ్రాఫ్ ఇండస్ట్రీలో అలానే వెళ్తోంది. కోయిలమ్మ సీరియల్ టైములో నేను అమర్ ని కలిసాను. అప్పుడు అమర్ నాతో మాట్లాడాడు..నన్ను చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత కాల్ చేయడం, చాట్ చేయడం చేసేవాడు. మే బి ట్రై చేసాడేమో అప్పుడే...నేను అప్పుడే అనుకున్నాను కానీ పడలేదు నువ్వు అంటుంటాడు.

Illu illalu pillalu : భాగ్యం చేసిన మోసం భయటపడుతుందా.. టెన్షన్ లో శ్రీవల్లి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -172 లో.... ధీరజ్ ని విశ్వ అవమానిస్తుంటే ప్రేమ వచ్చి.. విశ్వ ఫ్రెండ్స్ కి బుద్ది చెప్తుంది. దాంతో వాళ్ళు భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. చిన్న ఎర్రమిరపకాయలాగా ఉంది అందరిని భయపెట్టిందని ధీరజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ ఇద్దరు కాలేజీకి వస్తారు. ఎందుకు వాళ్ళని అలా అన్నావని ధీరజ్ అడుగుతాడు. నిన్ను అలా తక్కువ చేసి మాట్లాడుతుంటే.. నేను ఎలా ఉరుకుంటానని ప్రేమ అంటుంది. నన్ను అంటే నీకేంటి అని ధీరజ్ అడుగుతాడు. నాకేం ప్రేమ అంటుంది.

ఫంక్షన్స్ లో దొంగతనంగా వెళ్లి తినేవాళ్ళం...

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో రాబోయే వారం షో ప్రోమో చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రాకమానవు. ఈ న్యూ ఎపిసోడ్ ని ఫ్రెండ్ షిప్ థీమ్ గా రాబోతోంది. దాంతో ఈ షోలో కంటెస్టెంట్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చారు. ఇక శేఖర్ మాష్టర్ కోసం కూడా ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఎవరో కాదు సత్య మాష్టర్. ఇద్దరి మధ్య అంత ఎమోషనల్ బాండింగ్ ఎలా ఫార్మ్ అయ్యింది అని శ్రీముఖి అడిగేసరికి "ఉదయం 5 గంటలకే లేచేవాళ్ళం. రాత్రి వరకు మాకు డాన్స్ మాత్రమే ప్రపంచం అంతకు మించి మాకు ఇంకేం తెలీదు. మాకు ఆ టైములో తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు. ఐదేళ్లు అలా ఉన్నాం. దొంగచాటుగా ఫంక్షన్ హాల్స్ కి వెళ్ళేవాళ్ళం.. అక్కడే ఎక్కువగా తినేవాళ్ళం.

Illu illalu Pillalu: అన్నదమ్ముల మధ్య గొడవ.. ధీరజ్ కి తోడుగా ప్రేమ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-171లో.. చందు ఆఫీస్ కి రెడీ అవుతుంటే అప్పుడే శ్రీవల్లి వస్తుంది. మా ఆయన బంగారం.. ఎంత అందంగా ఉన్నారో నా దిష్టే తగిలేటట్టు ఉందని శ్రీవల్లి అనగానే చందు మురిసిపోతాడు. ఇక శ్రీవల్లికి చందు ముద్దు ఇవ్వాలనుకుంటాడు కానీ తను ఆపుతుంది. డోర్ ఓపెన్ లో ఉందని శ్రీవల్లి అనగానే చందు వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వస్తాడు. ఆ తర్వాత తనకి ముద్దు ఇచ్చి బయటకు వస్తాడు.  కాసేపటికి మిల్లుకి బయల్దేరడానికి సాగర్  బయటకు వస్తాడు. అదే సమయంలో చందు రావడంతో తనతో మాట్లాడతాడు.

Brahmamudi:  దొరికిపోయిన గజదొంగ ఛార్లెస్.. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-734లో.. అప్పు, కళ్యాణ్ ల శోభనం గదిని డెకరేట్ చేసిన రాజ్, కావ్య ఇద్దరు అదే గదిలో ఉంటారు. అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఛార్లెస్ అనే దొంగ కోసం బయటకు వెళ్తారు. అదే సమయంలో ధాన్యలక్ష్మికి డౌట్ వచ్చి అప్పు, కళ్యాణ్ ల గది దగ్గరికి వెళ్తుంది. ఇక రాజ్, కావ్య తెలివిగా ఆలోచించి.. వారి మొబైల్ ఫోన్ లో ఆల్రెడీ రికార్డ్ చేసిన అప్పు, కళ్యాణ్ ల వాయిస్ రికార్డింగ్స్ ని ప్లే చేస్తారు. అది విని ధాన్యలక్ష్మి ఇద్దరు గదిలోనే ఉన్నారని కన్ఫమ్ చేసుకుంటుంది. 

Karthika Deepam2: తాతగారింటికి దీప.. నాన్నను చూసి ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-370లో.. దీపకు నిజం చెప్పిన కార్తీక్.. ఆ తర్వాత అనసూయగారిని అడుగమని సలహా ఇస్తాడు. తీరా అనసూయతో మాట్లాడాక తట్టుకోలేక దీప గుడికి వెళ్లి గుడి ముందు దీపాలు వెలిగించి.. అక్కడే కూర్చుని ఏడుస్తుంటుంది. కార్తీక్ వెళ్లి దీపను ప్రేమగా పలకరించి.. నిజం తెలిసింది కదా.. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి దీపా.. లేదంటే మన తాత, సుమిత్ర అత్త, దశరథ్ మావయ్య అంతా ప్రమాదంలో పడతారు.. నిజానికి ఆ జ్యోత్స్న వాళ్లను చంపేసినా చంపేస్తుంది. కన్నతండ్రినే చంపాలనుకున్న మనిషి.. వాళ్లంతా తనకు ఓ లెక్క కాదు.. అందుకే నన్ను ఆ ఇంటికి వెళ్లనీ దీపా.. ఆ మనుషుల్లో మీపైన ఉన్న కోపాన్ని తగ్గిస్తాను.. నిన్ను ఆ ఇంటికి చేరుస్తానని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి దీప కూడా ఒప్పుకుంటుంది. మరోవైపు కార్తీక్ పని చేయడానికి ఇంటికి రాలేదని జ్యోత్స్న ఎదురు చూస్తుంది. అప్పుడే వచ్చిన పారిజాతం.. నీ బావ రాడే.. ఆ దీప రానివ్వదు.. చూస్తూ ఉండు.. కావాలంటే వెయ్యి బెట్టు అని కామెడీగానే మాట్లాడుతుంది.