English | Telugu

గురువులానే శిష్యుడు కూడా విజయం సాధిస్తాడా!?

ప్రస్తుతమున్న ఇంటెలిజెంట్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. నేటి తరం దర్శకులలో ఎక్కువమంది సత్తా ఉన్న దర్శకులను తన అసిస్టెంట్ నుంచి దర్శకులుగా ప్రమోట్ చేసిన ఘనత సుకుమారుకు లభిస్తుంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం సుకుమార్ శిష్యులు దర్శకులుగా వ‌ర‌స చిత్రాలు చేస్తున్నారు. తాజాగా సుకుమార్ ప్రియ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల నానితో దసరా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలైన టీజర్ సినిమాలపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన వెంటనే సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. నాని ఇందులో పూర్తిస్థాయి మాస్ అవతారంలో కనిపిస్తున్నారు.

తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. టీజర్ లో కీర్తి సురేష్ ని చూపించలేదు. అది కాస్త నిరాశ పరుస్తోంది. ఆమె కోసమే ఏమైనా స్పెషల్ టీజర్ ప్లాన్ చేసి ఉంటారని అంటున్నారు. తాజాగా ఒక విషయం తెరపైకి వచ్చింది. రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ శ్రీ‌కాంత్ ఓదెల‌ను మెచ్చుకున్నారు. 1000 మందికి కూడా కాస్ట్యూమ్స్ రెడీగా పెట్టగల సామర్థ్యం శ్రీకాంత్ ఓదెల‌కు ఉంది. నేను వచ్చి నేరుగా డైరెక్షన్ విషయాల మీదనే దృష్టి పెట్టే వాడిని.... అని ఆయన అప్పట్లో చెప్పుకొచ్చారు. అంత నమ్మకం ఉండబట్టే సుకుమార్ శిష్యుడి మీద నాని కూడా నమ్మకం పెట్టుకున్నారు. నాని అయితే ఏకంగా దసరా చిత్రం గురించి మాట్లాడుతూ, గత ఏడాది వచ్చిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్ట‌ర్ ల మాదిరిగా ద‌స‌రా ఈ ఏడాది ఆస్థాయిలో నిలుస్తుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు.

ఈ సినిమాకు దాదాపు 50 కోట్ల వరకు బడ్జెట్ పెట్టించాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. నాని కెరీర్ లోనే ఇది మరుపురాని చిత్రంగా మిగులుతుందని భావిస్తున్నారు. నాని అభిమానులు ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మొత్తం మీద సుకుమార్ శిష్యుడు కూడా పుష్పాలాంటి ఒక కథతో రా అండ్ ర‌గ్గ్‌డ్ చిత్రంతో ప్రేక్షకులను ఎలా అలరించబోతున్నాడో వేచి చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.