English | Telugu

వ‌రుణ్‌ధావ‌న్‌తో ర‌వితేజ‌... నార్త్ లో వైర‌ల్ అవుతున్న సౌత్ హీరోలు!

నిన్న‌టిదాకా స‌క్సెస్ స్ట్రీక్ మీదున్నారు ర‌వితేజ‌. లేటెస్ట్ గా ఆయ‌న న‌టించిన రావ‌ణాసుర విడుద‌లైంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వినిపిస్తోంది. కానీ నార్త్ లో మాత్రం ర‌వితేజ పేరు గ‌ట్టిగానే ట్రెండ్ అవుతోంది. ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య‌తో హిట్ ట్రాక్ లోకి వ‌చ్చారు ర‌వితేజ‌. రావ‌ణాసుర కూడా 100 కోట్ల క్ల‌బ్‌లోకి చేరుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. శింబు న‌టించిన మానాడు సినిమా రీమేక్‌లో వ‌రుణ్‌ధావ‌న్‌తో పాటు ర‌వితేజ కూడా న‌టిస్తార‌న్న‌ది లేటెస్ట్ న్యూస్‌. ఈ సినిమాను తెలుగులోనూ, హిందీలోనూ తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. త‌మిళ్‌లో ఈ సినిమాలో శింబు, ఎస్‌జె సూర్య క‌లిసి నటించారు.

మానాడు త‌మిళ్‌లో చాలా పెద్ద హిట్ అయింది. బెస్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాగానూ ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. స్క్రీన్ ప్లే ప‌రంగా చాలా మంచి మెచ్చుకున్న సినిమా ఇది. వెంక‌ట్‌ప్ర‌భు త‌మిళ్‌లో తెర‌కెక్కించారు. ఇప్పుడు హిందీ, తెలుగులో తెర‌కెక్కితే క్రాస్ బార్డ‌ర్ సినిమాగా పేరు తెచ్చుకుంటుంది. ర‌వితేజ న‌టించిన తెలుగు సినిమాల హిందీ వెర్ష‌న్ల‌కు మంచి ఆద‌ర‌ణ ఉంది. ఆయ‌న న‌టించిన కిక్ సినిమాను స‌ల్మాన్ తెర‌కెక్కంచారు. అక్క‌డ కూడా హిట్ అందుకున్నారు. అటు వ‌రుణ్ ధావ‌న్ కూడా సౌత్ సినిమాల్లో న‌టించాల‌ని ఉంద‌ని ఇప్ప‌టికే చాలా ఇంట‌ర్వ్యూల‌లో చెప్పారు. ఆయ‌న న‌టించిన బ‌వాల్ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు ర‌వితేజ‌కు హిందీ మాట్లాడ‌టం చాలా బాగా వ‌చ్చు. ఆయ‌న పంజాబీని కూడా అన‌ర్గ‌ళంగా మాట్లాడుతారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌కి ర‌వితేజ పెద్ద ఫ్యాన్‌. ఆయ‌న‌కు నార్త్ సినిమాల మీద, నార్త్ మార్కెట్ మీద‌, నార్ట్ ప్రేక్ష‌కుల అభిరుచుల మీద కూడా మంచి అవ‌గాహ‌న ఉంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.