English | Telugu

అజిత్ త‌ప్పేం లేద‌న్న న‌య‌న్ భ‌ర్త‌!

త‌న సినిమా మెటీరియ‌లైజ్ కాక‌పోవ‌డంలో అజిత్ త‌ప్పేమీ లేద‌ని అన్నారు న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌. ఈ ఏడాది సంక్రాంతికి తునివుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు అజిత్‌. ఈ సినిమా విడుద‌లైన వెంట‌నే, కొంచెం గ్యాప్ తీసుకుని ఏకే 62 సెట్స్ కి వెళ్లాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్‌. అప్పుడే ఆ సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి వీల‌వుతుంద‌ని అనుకున్నారు. తునివు రిలీజ్‌కి ముందే ఏకే 62 సినిమా విఘ్నేష్ శివ‌న్‌తోనే అని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను నిర్మించ‌డానికి లైకా సంస్థ కూడా ముందుకొచ్చింది. అయితే తునివు రిలీజ్ అయ్యాక ఫారిన్ ట్రిప్ వెళ్లారు అజిత్‌. ఆయ‌న ట్రిప్ నుంచి ఎంత‌కీ రాక‌పోవ‌డంతో విఘ్నేష్ శివ‌న్ సినిమా ఉన్న‌ట్టా లేన‌ట్టా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. దీని గురించి ఎవ‌రూ స్పందించ‌లేదు. కాక‌పోతే విఘ్నేష్ శివ‌న త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో ఏకే 62ని రిమూవ్ చేశారు. దీంతో అజిత్ సినిమాకు విఘ్నేష్ ప‌నిచేయ‌ట్లేద‌నే వార్త వైర‌ల్ అయింది. స‌రిగ్గా అప్పుడే మ‌గిళ్ తిరుమేని సీన్‌లోకి వ‌చ్చారు. ఆయ‌న చెప్పిన క‌థ అజిత్‌కి న‌చ్చింద‌ని, విఘ్నేష్ క‌థ‌ను అజిత్ వ‌ద్ద‌న్నార‌ని వార్త‌లొచ్చాయి.

అజిత్ త‌న‌తో వీడియో కాల్ మాట్లాడుతున్న పిక్‌ని పోస్ట్ చేశారు విఘ్నేష్‌. త‌మ మ‌ధ్య అంతా స‌వ్యంగానే ఉంద‌ని చెప్పే ప్ర‌యత్నం చేశారు. అయినా స‌మ్‌థింగ్ ఫిష్షీ అంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో లేటెస్ట్ గా ఈ ఇష్యూ గురించి మాట్లాడారు విఘ్నేష్ శివ‌న్‌. ``నేను ఏకే 62 నుంచి త‌ప్పుకోవ‌డంలో అజిత్‌గారి త‌ప్పు లేదు. నా క‌థ అజిత్‌గారికి న‌చ్చింది. కానీ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌కి న‌చ్చ‌లేదు. వాళ్లు సెకండ్ హాఫ్ మార్చ‌మ‌న్నారు. ఛాన్స్ మిస్ అయినందుకు నాకు చాలా బాధ క‌లిగింది. అయితే, ఈ సినిమా మ‌గిళ్ తిరుమేని లాంటి మంచి ద‌ర్శ‌కుడి చేతిలో ప‌డినందుకు ఆనందంగా ఉంది`` అని అన్నారు. ఇటీవ‌ల న‌య‌న‌తార - విఘ్నేష్ శివ‌న్ దేవుడిని ద‌ర్శించుకోవ‌డం కోసం కుంభ‌కోణం వెళ్లారు. అక్క‌డ విఘ్నేష్ శివ‌న్ కుల‌దైవానికి పూజ‌లు చేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.