English | Telugu

పవన్, ఎన్టీఆర్ రికార్డులని మహేష్ బ్రేక్ చేస్తాడా?

ఇప్పటిదాకా వారి కాంబినేషన్ లో వచ్చింది రెండు సినిమాలే అయినప్పటికీ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబోకి టాలీవుడ్ మంచి క్రేజ్ ఉంది. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా 'పోకిరి' సంచలన వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వీరి కాంబోలో రెండో సినిమాగా వచ్చిన 'బిజినెస్ మేన్' పోకిరి స్థాయి సంచలనాలు సృష్టించనప్పటికీ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి ఎందరో కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది. మహేష్ పుట్టినరోజు(ఆగస్టు 9) సందర్భంగా 'బిజినెస్ మేన్' చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు.

టాలీవుడ్ లో కొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు రీరిలీజ్ లోనూ మంచి వసూళ్లతో సత్తా చాటాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్, టోటల్ కలెక్షన్స్ కలెక్షన్స్ పరంగా 'ఖుషి', 'సింహాద్రి' టాప్ లో ఉన్నాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం రీరిలీజ్ సినిమాల్లో ఇప్పటిదాకా 'ఖుషి', 'సింహాద్రి' మాత్రమే మొదటిరోజు రూ.4 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాయి. ఖుషి రూ.4.15 కోట్ల గ్రాస్ రాబట్టగా, సింహాద్రి రూ.4.01 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక టోటల్ కలెక్షన్స్ పరంగానూ ఈ రెండు సినిమాలే టాప్ లో ఉన్నాయి. రీరిలీజ్ లోనూ ఖుషి వారానికి పైగా విజయవంతంగా ప్రదర్శితమై రూ.7.46 కోట్ల గ్రాస్ తో సత్తా చాటగా.. సింహాద్రి మాత్రం రెండు మూడు రోజులకే పరిమితమై రూ.4.60 కోట్ల గ్రాస్ సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో రూ.3.36 కోట్లతో 'ఆరెంజ్', రూ.3.20 కోట్లతో 'జల్సా' ఉన్నాయి. ఇక మహేష్ చిత్రాలు ఒక్కడు రూ.2.54 కోట్లు, పోకిరి రూ.1.73 కోట్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు 'బిజినెస్ మేన్'తో తన అసలిసలు బాక్సాఫీస్ స్టామినా చూపించబోతున్నారు మహేష్. ఇప్పటికే ఒక్క హైదరాబాద్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ తో కోటికి పైగా గ్రాస్ రాబట్టిందని అంటున్నారు. ఈ చిత్రం 'ఖుషి', 'సింహాద్రి' సినిమాల రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. మరి 'బిజినెస్ మేన్' ఆ అంచనాలను నిజం చేస్తూ రీరిలీజ్ లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.