English | Telugu

ఇండ‌స్ట్రీపై ప‌డ‌తారేంటి అంటూ జగన్ సర్కార్‌కి చిరంజీవి మాస్ వార్నింగ్!

మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు.అయితే సినిమాల పరంగా కాదు.. రాజ‌కీయాల ప‌రమైన కామెంట్స్‌తో. అదేంటి? ఇప్పుడు చిరంజీవి రాజకీయాల‌కు దూరంగా ఉంటున్నారు క‌దా. అన్నీ పార్టీల‌కు సంబంధించిన వ్య‌క్తులు ఆయ‌న‌తో స‌న్నిహితంగానే ఉంటున్నారు క‌దా. ఇప్పుడు మ‌ళ్లీ ఏమైంది? ఆయ‌న మ‌ళ్లీ పొలిటిక‌ల్‌గా చేసిన కామెంట్స్ ఏంటి? స‌ంద‌ర్భ‌మేంటనే వివ‌రాల్లోకి వెళితే, సోమ‌వారం సాయంత్రం చిరంజీవి హీరోగా న‌టించిన ‘వాల్తేరు వీర‌య్య’ సినిమాకు సంబంధించిన 200 డేస్ సెల‌బ్రేష‌న్స్ హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో చిరంజీవి మాట్లాడుతూ ఇన్‌డైరెక్ట‌గా ఏపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు. పర్టికుల‌ర్‌గా చిరంజీవి ఏపీ ప్ర‌భుత్వాన్నే టార్గెట్ చేశార‌ని చెప్ప‌టానికి కార‌ణం ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడ‌ట‌మే.

‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి’’ అంటూ ‘వాల్తేరు వీర‌య్య’ 200 డేస్ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి చేసిన కామెంట్స్, దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. మ‌రి దీనిపై పొలిటిక‌ల్ వ‌ర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయ‌నేది చూడాలి. ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా విడుదలైన ‘వాల్తేరు వీర‌య్య’ సినిమా ఏకంగా రూ.200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఇందులో చిరంజీవి త‌మ్ముడి పాత్ర‌లో ర‌వితేజ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా చిరంజీవి హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ భోళా శంక‌ర్ ఆగ‌స్ట్ 11న రిలీజ్ అవుతుంది. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. మెహ‌ర్ ర‌మేష్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.