English | Telugu

అజిత్ ఫొటో షేర్ చేసిన విఘ్నేష్‌... భార్య‌ కోస‌మేనా?

అజిత్ ఇప్పుడు నాన్‌స్టాప్‌గా ట్రెండింగ్ లో ఉన్నారు. సంక్రాంతి సీజ‌న్‌లో తునివు సినిమాతో ట్రెండ్ అయ్యారు. ఆ త‌ర్వాత తునివు క‌లెక్ష‌న్ల టాపిక్ న‌డిచింది. అది కాస్త చ‌ల్లారాక ఏకే 62కి సంబంధించి వ‌రుస‌గా అప్ డేట్స్ వ‌చ్చాయి. అజిత్ హీరోగా విఘ్నేష్ డైర‌క్ష‌న్లో న‌టించ‌బోయే హీరోయిన్ల లిస్టు కూడా రిలీజ్ అయింది. స‌రిగ్గా అప్పుడే ట్విస్టు క‌నిపించింది. విఘ్నేష్ ఆ సినిమా నుంచి త‌ప్పుకున్నార‌ని వార్త‌లొచ్చాయి. అజిత్ - విఘ్నేష్ మ‌ధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వ‌చ్చాయ‌ని అన్నారు. ఏకే62ని మ‌గిళ్ తిరుమేని అనే డైర‌క్ట‌ర్ అతి త్వ‌ర‌లో డైర‌క్ట్ చేస్తార‌ని అన్నారు. దానికి త‌గ్గ‌ట్టే త‌న మూవీస్ లిస్టు నుంచి ఏకే 62ని సోష‌ల్ మీడియాలో అర్ధాంత‌రంగా తీసేశారు విఘ్నేష్ శివ‌న్‌.

అంతే సంగ‌తులు, అజిత్ మూవీ నుంచి విఘ్న‌ష్ ఔట్‌. త‌న భ‌ర్తకు ఈ ర‌కంగా జ‌రిగినందుకు న‌య‌న‌తార అవ‌మానం ఫీల‌య్యారు. ఆమె ఇక అజిత్ సినిమాలో న‌టించ‌న‌ని శ‌ప‌థం చేశార‌ట‌. త‌న‌కు తెలిసిన‌వారితో అజిత్ సినిమా కోస‌మైతే త‌న‌ను అప్రోచ్ కావాల్సిన ప‌నిలేద‌ని చెప్పేశార‌ట అంటూ వార్త‌లొచ్చాయి. అయితే అలాంటిదేమీ లేద‌ని, ఒక్క ఫొటోతో అంద‌రికీ చెప్పేశారు విఘ్నేష్ శివ‌న్‌. అజిత్ న‌వ్వుతూ వీడియో కాల్ మాట్లాడుతున్న ఫొటోను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు విఘ్నేష్‌. అజిత్ కీ, త‌న‌కూ ఎలాంటి విభేదాలు లేవ‌ని ఆ పోస్టుతో చెప్ప‌క‌నే చెప్పేశారు.అయితే అజిత్ సినిమాను తాను డైర‌క్ట్ చేస్తున్నారా? లేదా? అనే విష‌యం మీద మాత్రం ఇప్ప‌టిదాకా క్లారిటీ
అయితే ఇవ్వలేదు విఘ్నేష్‌.

అజిత్ మూవీ కార‌ణంగా, త‌న వ‌ల్ల త‌న వైఫ్ ఇబ్బంది ప‌డ‌టాన్ని చూడ‌లేక విఘ్నేష్ చేసిన ఈ ప‌నిని చూసి అత‌న్ని నెటిజ‌న్లు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. అన్నిటికీ మాట‌ల‌తో సమాధానం చెప్పాల్సిన పనిలేదు. అప్పుడ‌ప్పుడూ ఇలా అద్భుతంగా రియాక్ట్ కావ‌చ్చు. అది విఘ్నేష్‌కే సాధ్యం అని అంటున్నారు సూప‌ర్‌స్టార్ అభిమానులు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.