English | Telugu

అఖిల్ సినిమా మణిరత్నం సినిమాను తట్టుకోగలదా!

లెజెండరీ దర్శకుడు మణిరత్నం మరల ఫామ్ లోకి వచ్చారు. పోనియన్ సెల్వ‌న్ తో భారీ హిట్ నమోదు చేసుకున్నారు. కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందించగా మొదటి భాగాన్ని గత ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేశారు. రెండో భాగాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రొమోను కూడా రిలీజ్ చేశారు.

అయితే అదే తేదీన హీరో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడింది. దాంతో ఈసారి వాయిదా వేసే ఆలోచన లేకుండా ఏప్రిల్ 28 చేయబోతున్నట్టు బృందం అఫీషియల్ గా తెలియజేసింది. అయితే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 చిత్రం ముందు దక్షిణాదినా ఏజెంట్ సినిమా తట్టుకొని నిలబడగలదా అనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. ఏజెంట్ సినిమా యూనిట్ తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని కొందరు విశ్లేషిస్తున్నారు. కొంతమంది ఈ నిర్ణయం తప్పని అంటున్నారు. ముందుగా అనుకున్నట్లు ఏప్రిట్ 14న సినిమా విడుదల చేస్తే బాగుంటుందని స్పందిస్తున్నారు.

దీనికి ఈ చిత్ర బృందం ఎలా స్పందించడంలో అర్థం కావడం లేదు. సినిమా రిలీజ్ విషయంలో మరోసారి ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అఖిల్కు ఏజెంట్ సినిమాపై ఎన్నో ఆశ‌లున్నాయి. అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. అఖిల్ స‌ర‌స‌న సాక్షి వైద్య నటిస్తోంది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మమ్ముట్టి అఖిల్ను పట్టుకోవడం కోసం ప్రయత్నం చేసే అధికారిగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాలి. మొత్తానికి ఇది అఖిల్ కు సురేందర్ రెడ్డి కి డూ ఆర్ డై వంటి ప‌రిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వారు మణిరత్నంకు పోటీగా వెళ్లడం సరైన నిర్ణయం కాదేమో అని చాలామంది అభిప్రాయం.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.