English | Telugu

సీనియర్ డైరెక్టర్ కె. వాసు కన్నుమూత

సీనియర్ డైరెక్టర్ కె. వాసు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఒకప్పటి గొప్ప దర్శకుడు కె. ప్రత్యగాత్మ ఆయన తండ్రే. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి అగ్ర హీరోలతో కె. వాసు చిత్రాలు రూపొందించారు. 1974లో విడుదలైన 'ఆడపిల్లల తండ్రి' దర్శకుడిగా ఆయన తొలి చిత్రం.

చిరంజీవి నటించగా తొలిగా విడుదలైన 'ప్రాణం ఖరీదు' (1978) చిత్రానికి కె. వాసు దర్శకుడు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా ఆయన 'కోతల రాయుడు' (1979), 'ఆరని మంటలు' (1980) సినిమాలు తీశారు. ఎన్టీ రామారావుతో 'సరదా రాముడు' (1980), శోభన్‌బాబుతో 'దేవుడు మావయ్య' (1981), కృష్ణంరాజుతో 'గువ్వల జంట', 'బాబులు గాడి దెబ్బ' చిత్రాలు రూపొందించారు. కృష్ణ, చిరంజీవి హీరోలుగా నటించిన 'తోడు దొంగలు' (1981) మూవీ డైరెక్టర్ కె. వాసునే.

ఆయన డైరెక్ట్ చేయగా పాపులర్ అయిన సినిమాల్లో ఏది పాపం ఏది పుణ్యం, గోపాలరావు గారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, కలహాల కాపురం, కొత్త దంపతులు, అమెరికా అల్లుడు, శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం, అయ్యప్పస్వామి మహత్యం, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం, పుట్టినిల్లా మెట్టినిల్లా తదితర చిత్రాలు ఉన్నాయి.

కె. వాసు మృతిపై చిరంజీవి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తన తొలినాటి చిత్రాలు 'ప్రాణం ఖరీదు', 'కోతల రాయుడు'ను ఆయన డైరెక్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .