English | Telugu

నేచురల్ స్టార్ చేతికి అల్లు అర్జున్ 'ఐకాన్'!

రెండేళ్ల క్రితం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'ఐకాన్' అనే మూవీ తెరకెక్కాల్సి ఉండగా ఏవో కారణాల వల్ల అటకెక్కింది. ఆ తర్వాత అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో బిజీ అయిపోయాడు. మరోవైపు వేణు శ్రీరామ్ కూడా 'ఐకాన్'ని పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ హీరోగా 'వకీల్‌ సాబ్' అనే చిత్రాన్ని రూపొందించి హిట్ కొట్టాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు వేణు మనసు మళ్ళీ 'ఐకాన్' వైపు మళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ని నేచురల్ స్టార్ నానితో తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

'ఓ మై ఫ్రెండ్'తో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరామ్.. తన రెండో సినిమా 'ఎంసీఏ'(మిడిల్ క్లాస్ అబ్బాయి)ని నానితో చేసిన సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత తన మూడో సినిమా 'వకీల్‌ సాబ్'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న వేణు.. ఇప్పుడు తన నాలుగో సినిమాని నానితో చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా వేణు దర్శకత్వం వహించిన మూడు సినిమాలకు దిల్ రాజునే నిర్మాత కాగా.. ఇప్పుడు నాలుగో సినిమాని కూడా ఆయనే నిర్మించబోతున్నారట. 'ఐకాన్' స్క్రిప్ట్ పట్ల దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.

కాగా నాని మార్చి 30న 'దసరా' అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే తన తదుపరి చిత్రం(నాని 30)ని శౌర్యువ్ దర్శకత్వంలో ప్రకటించాడు. మరి నాని తన 31వ సినిమాని తనకు 'ఎంసీఏ' వంటి సూపర్ హిట్ ఇచ్చిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తాడేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.