English | Telugu

వెంకటేష్, త్రిష మూవీ ప్రారంభం

విక్టరీ వెంకటేష్ హీరోగా, అందాల త్రిష హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ఏప్రెల్ 4 వ తేదీన ప్రారంభమయ్యింది. వివరాల్లోకి వెళితే శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రంఏప్రెల్ నాలుగవ తేదీన, ఉగాది పర్వదినం సమదర్భంగా ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ వెంకటేష్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రానికి ప్రముఖ యువ దర్శకుడు శ్రీను వైట్ల కెమెరా స్విచ్చాన్ చేయగా, మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు క్లాప్ కొట్టగా, మరో ప్రముఖ యువ దర్శకుడు వినాయక్ ముహూర్తం షాట్ కు గౌరవ దర్స్ఝకత్వం వహించగా ఈ చిత్రం సినీ ప్రముఖుల సమక్షంలో, ఉగాది పర్వదినం సందర్భంగా ప్రారంభమయ్యింది.


ఈ వెంకటేష్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రానికి కోన వెంకట్ సంభాషణలు వ్రాస్తుండగా, తమన్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ బెల్లం కొండ సురేష్ నిర్మించిన "నాగవల్లి" చిత్రం తర్వాత అదే బ్యానర్ లో తాను నటిస్తున్న రెండవ చిత్రమనీ, త్రిషతో మూడవ చిత్రమనీ, ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనీ, అలాగే ఇండియా వరల్డ్ కప్ గెలవటం చాలా ఆనందంగా ఉందనీ, తాను ప్రతి మ్యాచ్ నీ దగ్గరుండి చూడడంతో అక్కడ టీమిండియాని ఛీరప్ చేయటానికి అరిచి అరిచి గొంతు పోయిందనీ అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఇంకా త్రిష, తమన్, మలినేని గోపీచంద్, బెల్లంకొండ సురేష్, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.