English | Telugu

'యానిమల్'కి పోటీగా ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ!

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'యానిమల్'. డిసెంబర్ 1న ఈ చిత్రం భారీస్థాయిలో విడుదల కానుంది. అయితే అదే రోజున ఉపేంద్ర అనే కొత్త హీరో నటించిన సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కాబోతోంది.

కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన చిత్రం 'ఉపేంద్ర గాడి అడ్డా'. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ విషయాన్ని సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు, తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, "సాధారణంగా చిత్రపరిశ్రమలోని వాళ్లు అయినా కొత్తగా పరిశ్రమలోకి వచ్చినవాళ్లు అయినా తమ కుమారులను హీరోలుగా పరిచయం చేస్తూ, ఒకే ఒక్క సినిమాను చేస్తుంటారు. ఆ తర్వాత వాళ్లు బయటి నిర్మాతల సినిమాలను చేయడం చూస్తున్నదే. అయితే ఈ చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు గారు కుమారుడు కంచర్ల ఉపేంద్రను హీరోగా పెట్టి, ఇదే బ్యానర్ లో వరుసగా ఐదు సినిమాలు తీస్తుండటం ఒక సంచలనం, ఒక విశేషం. దీనిని ఉపేంద్ర నిలబెట్టుకుని, హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలి" అని ఆకాంక్షించారు.

నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, "తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ , హిందీ భాషలలో డిసెంబర్ 1న ఈ సినిమాను భారీగా విడుదల చేయబోతున్నాం. మా బ్యానర్ లో మేము వరుసగా తీస్తున్న సినిమాలను ప్రతీ నెలా ఒకటి చొప్పున విడుదల చేయబోతున్నాం. ఎన్నో ఏళ్లుగా విశాఖపట్నం లో మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము తీస్తున్న సినిమాల ద్వారా వచ్చే లాభాలను కూడా ప్రజా సేవా కార్యక్రమాలకు వెచ్చించదలచుకున్నాం" అని అన్నారు.

హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ , "కొత్తగా పరిచయం కాబోతున్న నన్ను హీరోగా పెట్టి, మా నాన్న ఐదు సినిమాలు ఒకేసారి తీస్తుండటం నా అదృష్టం. తప్పకుండా నా ప్రతిభను నిరూపించుకుంటాను. ఒక కొత్త హీరో ప్రేక్షకులకు దగ్గరయ్యే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి" అని అన్నారు.

దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, "మాస్, ఎంటర్టైన్ మెంట్ వంటి అంశాలకు సందేశాన్ని మిళితం చేసి, ఈ సినిమాను తీశాం. సోషల్ మీడియా నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియంది కాదు. దానివల్ల చెడు మార్గాన్ని ఎంచుకోకుండా, మంచిని పెంపొందింపజేస్తే, సమాజం మరింత వికాసవంతం అవుతుందన్న పాయింట్ ను ఇందులో చూపించాం" అని అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.