English | Telugu

మెగా156 దర్శకుడి గౌరవ దర్శకత్వంతో ప్రారంభమైన అశ్విన్ బాబు సినిమా

హిడింబ సినిమాతో మంచి హిట్ కొట్టిన అశ్విన్ బాబు ఇప్పుడు తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. అశ్విన్ సరసన దిగంగనాసూర్యవంశీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవానికి చలన చిత్ర పరిశ్రమకి చెందిన అతిరథ మహారథులంతా హాజరవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా టాక్ అఫ్ ది ఫిలిం న్యూస్ గా మారింది.

మెగాస్టార్ 156వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నవశిష్ట మల్లిడి అశ్విన్ నూతన చిత్రానికి సంబంధించిన తొలి సన్నివేశానికి గౌరవదర్శకత్వం వహించాడు. అలాగే నాంది లాంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల క్లాప్ ని ఇవ్వగా, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ దర్శకుడు సుబ్బు మంగాదేవి కెమెరా స్విచ్ఛాన్ చేసాడు. ఓంకార్ సినిమా స్కిప్ట్ ని అందచేయడంతో పాటు ప్రముఖ అగ్ర నిర్మాతలైన ఠాగూర్ మధు, సుధాకర్ రెడ్డి, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు.

గంగఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మాట్లాడుతూ హిడింబ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత అశ్విన్ బాబు మా సంస్థలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే మా సినిమా సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా అని కూడా ఆయన అన్నారు.

అప్సర్దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతుంది.హైపర్ ఆది ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా దాశరధి శివేంద్ర కెమెరా బాధ్యతలని నిర్వహిస్తున్నారు. వికాస్ బడిస సంగీతాన్ని అందిస్తున్నాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .