English | Telugu

'టైగర్ నాగేశ్వరరావు' టీజర్.. పాన్ ఇండియా రేంజ్ లో మాస్ రాజా ఊచకోతే! 

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.

"నేటి ముఖ్యాంశాలు.. హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ వంటి అనేక నగరాల్లో దోపిడీలు చేసిన స్టువర్టుపురం దొంగ మద్రాస్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు" అంటూ టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. 80 సెకన్ల నిడివిగల టీజర్ లో రవితేజ పాత్రను చూపించింది కాసేపే అయినప్పటికీ.. టీజర్ ని ఎంతో పవర్ ఫుల్ గా రూపొందించారు. "నాగేశ్వరరావు పాలిటిక్స్ లోకి వెళ్ళుంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్ళుంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచేవాడు. ఆర్మీకి వెళ్ళుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. అన్‌ఫార్చునేట్లీ ఒక క్రిమినల్ అయ్యాడు." అంటూ నాగేశ్వరరావు పాత్రను ఎలివేట్ చేసిన తీరు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ మెప్పిస్తోంది. టీజర్ చూస్తుంటే రవితేజ పాన్ ఇండియా రేంజ్ లో సాలిడ్ సక్సెస్ అందుకుంటాడనే నమ్మకం కలుగుతోంది.

జి. వి. ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్, రేణూ దేశాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.