English | Telugu

మెగా బ్రదర్స్ రీమేక్స్ ఎఫెక్ట్.. రెండు వారాల వ్యవధిలో రూ.80 కోట్ల నష్టం!

రీమేక్స్ వద్దంటూ ఫ్యాన్స్ ఎంత మొత్తుకుంటున్నా.. మెగా బ్రదర్స్ మాత్రం "రీమేక్స్ చేస్తే తప్పేంటి?" అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. అయితే రీమేక్స్ విషయంలో ఒకప్పటి పరిస్థితి ఎలా ఉన్నా.. ఓటీటీ ట్రెండ్ లో మాత్రం వాటికి ఒక రకంగా కాలం చెల్లిందనే చెప్పాలి. కేవలం రెండు వారాల వ్యవధిలో విడుదలైన రెండు మెగా ప్రాజెక్ట్స్ కి వచ్చిన నిరాశజనక ఫలితాలే ఇందుకు తాజా నిదర్శనం.

ఆ వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జూలై 28న జనం ముందు నిలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం 'బ్రో'. తమిళ సినిమా 'వినోదయ సిత్తం' ఆధారంగా మాతృక దర్శకుడు పి. సముద్రఖని తెరకెక్కించిన 'బ్రో'.. ఫస్ట్ వీకెండ్లో మంచి వసూళ్ళు ఆర్జించినప్పటికీ ఓవరాల్ గా రూ. 30 కోట్లకు పైగా నష్టాన్ని చూస్తోందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక ఆగస్టు 11న వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళా శంకర్' విషయానికి వస్తే.. మరో తమిళ సినిమా 'వేదాళమ్' ఆధారంగా మెహర్ రమేశ్ తెరకెక్కించిన ఈ మూవీకొన్ని చోట్ల ఆరో రోజే 'జీరో' షేర్స్ చూసి ట్రేడ్ ని విస్మయపరిచింది. ఓవరాల్ గా ఈ సినిమాకి రూ. 50 కోట్ల వరకు నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు. అంటే.. మెగా బ్రదర్స్ తాజా రీమేక్స్కేవలం రెండు వారాల్లో రూ. 80 కోట్ల నష్టం మూటగట్టుకున్నట్టే. ఈ ఫలితాలు చూసి ఇటు ప్రేక్షకులు, అటు పరిశ్రమ వర్గాలు.. "రీమేక్స్ విషయంలో ఇకనైనా ఆలోచించాల్సిందే బాసూ!" అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.