English | Telugu

విదేశాల నుండి తిరిగి రానున్న అల్లు అర్జున్

విదేశాల నుండి తిరిగి రానున్న అల్లు అర్జున్ అని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే తెలుగులో ప్రముఖ యువ హీరోగా వెలుగుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ మధ్య విదేశాలకు వెళ్ళారు. ఇది ఒక విధంగా హనీమూన్ అనుకోవచ్చు. ఎందుకంటే కండలు పెంచిన కొత్తపెళ్ళి కొడుకు భార్యనొదిలి విదేశాలకు ఎందుకెళ్తాడు చెప్పండి. అలా భార్యా సమేతంగా అల్లు అర్జున్ యు.యస్.కీ, స్విట్జర్ల్యాండ్ కీ వెళ్ళి సరదాగా తిరిగి మళ్ళీ జూలై 15 వ తేదీన ఇండియాకి తిరిగి వస్తున్నారట.

ఆయన ఇండియాకి తిరిగి రాగానే, తాను హీరోగా నటించబోయే కొత్త సినిమా యొక్క వివరాలు ప్రకటిస్తారట. అల్లు అర్జున్ ఇటీవల హీరోగా నటించగా విడుదలైన "బద్రినాథ్" చిత్రం ఊహించిన స్థాయిలో ఘనవిజయం సాధించకపోవటంతో కొన్నాళ్ళు అలా విదేశాలకు వెళ్ళి తిరిగి రెట్టించిన నూతనోత్సాహంతో మళ్ళీ తన కొత్త సినిమాలో నటించబోతున్నారు అల్లు అర్జున్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.