English | Telugu

'జైలర్' ట్రైలర్.. సూపర్ స్టార్ ఫుల్.. తమన్నా నిల్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జైలర్'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్ అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి కావాలా సాంగ్ విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఆగస్టు 10న విడుదల కానున్న ఈ సినిమా కోసం సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది.

'జైలర్' ట్రైలర్ ను ఈరోజు(ఆగస్టు 2) సాయంత్రం విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లో సూపర్ స్టార్ స్క్రీన్ ప్రజెన్స్, మ్యానరిజమ్స్ హైలైట్ గా నిలిచాయి. మొదట్లో సైలెంట్ గా పిల్లిలా కనిపించే రజనీ, ఆ తర్వాత వైలెంట్ మారి పులిలా తిరగబడితే ఎలా ఉంటుంది అన్నట్లుగా ట్రైలర్ ను రూపొందించారు. ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. సూపర్ స్టార్ యాక్షన్ కి తగ్గట్టుగా అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. అయితే ట్రైలర్ లో ఒకే ఒక లోటుంది. అదేంటంటే 'కావాలా' సాంగ్ లో చిందేసి సోషల్ మీడియాలో ఆ పాటతో పాటు సినిమా పేరు మారుమోగేలా చేసిన తమన్నా మాత్రం ట్రైలర్ లో కనిపించలేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.