English | Telugu

హైదరాబాద్ లో 'పుష్ప'.. 'దేవర'కి పోటీ కానుందా!

"తగ్గేదేలే" అంటూ 'పుష్ప - ది రైజ్'(2021)తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కట్ చేస్తే.. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం 'పుష్ప - ది రూల్'తో అంతకుమించి ఫలితం అందుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తిచేసుకుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ ఈ నెల 5 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని.. ఇవి సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని బజ్. కాగా, ఈ సినిమాని వేసవి కానుకగా ఏప్రిల్ ప్రథమార్ధంలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే గనుక నిజమైతే.. ఏప్రిల్ 5న రాబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర'కి 'పుష్ప - ది రూల్' పోటీ ఇవ్వబోతున్నట్లే. త్వరలోనే 'పుష్ప - ది రూల్' రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.