English | Telugu

సిద్ధార్థకు క్షమాపణ చెప్పిన స్టార్‌ హీరో!

ఒక హీరోకి తమ ప్రాంతంలో ఇబ్బంది ఎదురైందని, దాని వల్ల అతను ఇబ్బంది పడ్డాడని తెలుసుకున్న ఒక స్టార్‌ హీరో అతనికి సారీ చెప్పాడు. విషయం ఏమిటంటే ఒక సినిమా ప్రమోషన్‌ నిమిత్తం బెంగుళూరు వెళ్ళిన సిద్ధార్థకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అతని తాజా చిత్రం ‘చిత్తా’ ప్రమోషన్‌ కోసం బెంగుళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివాదం చోటు చేసుకుంది. కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య కొంతకాలంగా వివాదం ఉన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బెంగుళూరులో నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సిద్ధార్థ ప్రెస్‌మీట్‌కి కూడా ఆందోళనకారులు వచ్చారు. ఓ తమిళ సినిమా ప్రమోషన్‌ ఎలా చేస్తారని సిద్ధార్థపై విరుచుకుపడ్డారు ఆందోళనకారులు. ప్రెస్‌మీట్‌ను నిలిపివేసి వెళ్లిపోవాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో సిద్థార్థ కన్నడలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. చేసేది లేక అందరికీ నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు సిద్ధార్థ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ స్పందించి సిద్ధార్థకు క్షమాపణ చెప్పారు.

ఈ విషయమై శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘సిద్ధార్థ ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్నది ఎవరో నాకు తెలీదు. అలా చేయడం తప్పు. కన్నడ ప్రజలు అందర్నీ స్వాగతిస్తారు.ఈ విషయంలో సిద్ధార్థ్‌గారికి క్షమాపణలు చెబుతున్నాను. ఆ వీడియో చూసి చాలా బాధ పడ్డాను. ఇది మనసులో పెట్టుకోకండి’ అన్నారు. శివరాజ్‌కుమార్‌ ఇలా క్షమాపణ చెప్పడం చాలా గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.