English | Telugu

ప్రేక్షకులను మోసం చేసిన 'స్పై' మూవీ టీమ్!

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం తమ సినిమాని మేకర్స్ రకరకాలుగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అయితే కథ విషయంలో ప్రేక్షకులని తప్పుదోవ పట్టించి, వారి దృష్టిని ఆకర్షించాలనే ఆలోచన దాదాపు ఎవరూ చేయరు. ఎందుకంటే అలా చేస్తే అసలుకే మోసం వస్తుంది. అంచనాలతో థియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకులు సినిమా చూసి పూర్తిగా నిరాశచెందే అవకాశముంది. ఇప్పుడు 'స్పై' సినిమాది ఇంచుమించు అలాంటి పరిస్థితే.

నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన తాజా చిత్రం 'స్పై'. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాగా ఇది ప్రచారం పొందింది. ప్రధానంగా ఆ అంశాన్ని హైలైట్ చేస్తూనే మూవీ టీం ప్రమోషన్స్ చేసింది. టీజర్ లో కూడా అదే అంశాన్ని హైలైట్ చేశారు. టైటిల్ లోగోలో కూడా నేతాజీ బొమ్మనే పెట్టారు. భారతీయుల దృష్టిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రియల్ హీరో. ఆయన డెత్ మిస్టరీ నేపథ్యంలో సినిమా అంటే సహజంగానే అందరి దృష్టి దానిమీద పడుతుంది. పైగా ఆ కథకి 'కార్తికేయ-2'తో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకున్న నిఖిల్ తోడయ్యాడు. అందుకే ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపించారు. తీరా ఈరోజు(జూన్ 29) సినిమా విడుదలయ్యాక చూస్తే, సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నేతాజీ పేరుని వాడుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా అసలు నేతాజీ డెత్ మిస్టరీ చుట్టూ అల్లుకున్న కథ కాదు. కథలో నేతాజీ అంశం అనేది చిన్న భాగం మాత్రమే. అసలే ప్రధాన కథ నేతాజీ డెత్ మిస్టరీ కాకపోవడం, దానికి తోడు మిగతా సినిమా ఏమంత ఆకట్టుకునేలా లేకపోవడంతో మూవీ టీమ్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .