English | Telugu

నాంపల్లి కోర్టులో శిరీష్ భరద్వాజ్ లొంగుబాటు

నాంపల్లి కోర్టులో శిరీష్ భరద్వాజ్ లొంగుబాటు. వివరాల్లోకి వెళితే గత ముప్పై యేళ్ళుగా తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలిగిన పద్మభూషణ్, మెగాస్టార్, డాక్టర్ చిరంజీవి ద్వితీయ కుమార్తె శ్రీజను ప్రేమవివాహం చేసుకున్నాడు శిరీష్ భరద్వాజ్. వారి వివాహం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మాదిరిగా అటు మీడియాలో, ఇటు ప్రజల్లో చాలా సంచలనాన్ని కలిగించింది. ఆ తర్వాత వారికి ఒక పాప పుట్టింది. అప్పటి నుండీ చిరంజీవి కుటుంబానికి ఆ దంపతులిద్దరూ చేరువయ్యారు.

కానీ ఉన్నట్టుంది వాళ్ళిద్దరి మధ్య కలతలేర్పడ్డాయి. ఫలితం...కట్నం కోసం తన భర్త శిరీష్ భరద్వాజ్ తనను ప్రతి రోజూ మానసికంగా, శారీరకంగా వేదిస్తున్నాడని శ్రీజ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. అప్పటి నుండీ అజ్ఞాతంలో ఉన్నశిరీష్ భరద్వాజ్ ఈ రోజు అంటే జూలై 27 వ తేదీ ఉదయం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో లొంగిపోవటం జరిగింది. ప్రస్తుతం శ్రీజ తన తల్లిదండ్రుల నీడనే ఉంటోందని సమాచారం. వయసుపొంగులో ప్రేమ అంటూ యువత తొందరపాటుతో తీసుకునే నిర్ణయాల ఫలితాలిలాగే ఉంటాయని వీరి వ్యవహారం మరోసారి నిరూపించింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.