English | Telugu

బాలీవుడ్ ని భయపెడుతున్న పుష్పరాజ్!

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ హైప్డ్ సినిమాలలో 'పుష్ప: ది రూల్' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప: ది రైజ్' 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. దీనికి కొనసాగింపుగా రెండో భాగంగా 'పుష్ప: ది రూల్' రూపుదిద్దుకుంటోంది. 'పుష్ప-2'పై నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రూ.1000 నుంచి1500 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముందనే అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో ఆ తేదీకి రావాలని చూసిన పలు భాషల సినిమాలు వెనక్కి తగ్గుతున్నాయి.

బాలీవుడ్ లో రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో భాగంగా రూపొందే 'సింగం' సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా ఈ సిరీస్ నుంచి 'సింగం', 'సింగం రిటర్న్స్' రాగా.. రెండు ఘన విజయం సాధించాయి. హీరోగా అజయ్ దేవ్‌గణ్ కి మంచి కమర్షియల్ సక్సెస్ ని అందించాయి. ఇప్పుడు వీరి కలయికలో 'సింగం ఎగైన్' రూపొందుతోంది. ఈ సినిమాని 2024 ఆగస్టు 15న విడుదల చేయాలని మొదట భావించారు. కానీ ఇప్పుడు 'పుష్ప-2' దెబ్బకి రిలీజ్ డేట్ మార్చుకోవాలని చూస్తున్నారట. అజయ్ దేవ్‌గణ్, రోహిత్ శెట్టి ల సినిమా. పైగా సింగం సిరీస్. కరీనా కపూర్, దీపికా పదుకొణె ముఖ్యపాత్రలు పోషించడంతో పాటు, అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్ చేస్తున్నారట. దానికితోడు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, కరణ్ జోహార్ నిర్మాతలు. ఇన్ని పాజిటివ్ లు, ఇంత బలం ఉన్నప్పటికీ.. పుష్పరాజ్ పోటీలో ఉంటే తమ సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడుతుందని భావించిన సింగం టీమ్.. కొత్త విడుదల తేదీ చూసుకునే పనిలో ఉందట. ఇదే బాటలో ఇతర భాషలకు చెందిన మరికొన్ని సినిమాలు పయనించే అవకాశముంది అంటున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.