English | Telugu

'అర్జున్ రెడ్డి'లా మారిన 'అతడు' చైల్డ్ ఆర్టిస్ట్!

తెలుగు ప్రేక్షకులు టీవీలలో అత్యధిక సార్లు వీక్షించిన సినిమాలలో 'అతడు' ఖచ్చితంగా ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో దాదాపు అన్ని సీన్లు, డైలాగ్ లు గుర్తుండిపోతాయి. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్ర నవ్వులు పూయిస్తుంది. అందులో బ్రహ్మి కొడుకు పాత్రలో దీపక్ సరోజ్ నటించాడు. "నాన్న ట్రైన్ తెమ్మన్నాను.. తెచ్చావా?", "మన స్కూల్ బెంచ్ లా ఎంత గట్టిగా ఉందోరా" అంటూ తన అమాయకపు మాటలతో ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అతను అర్జున్ రెడ్డిలా మారిపోయాడు.

'అతడు'తో పాటు 'ఆర్య', 'భద్ర', 'లెజెండ్' వంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో వి యశస్వి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి 'సిద్ధార్థ్ రాయ్' అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టారు. తాజాగా మేకర్స్ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, బడా నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా విడుదల చేశారు. 'సిద్ధార్థ్ రాయ్' పోస్టర్లు అర్జున్ రెడ్డి చిత్రాన్ని తలపించేలా ఉన్నాయి.

'సిద్ధార్థ్ రాయ్' అనగానే పవన్ కళ్యాణ్ నటించిన 'ఖుషి' సినిమా గుర్తుకొస్తుంది. అందుకే ఆయన 'సిద్దు సిద్ధార్థ రాయ్' అంటూ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. ఇప్పుడు ఆ డైలాగ్ నుంచే టైటిల్ తీసుకోవడం విశేషం. నిజానికి ఈ టైటిల్ ని పవన్ కోసం హరీష్ శంకర్ రిజిస్టర్ చేయించారట. అయితే మూవీ టీమ్ రిక్వెస్ట్ చేయడంతో ఆయన ఈ టైటిల్ వారికి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.