English | Telugu

ప్రభాస్‌తో పోటీ పడలేనంటున్న షారూక్‌.. ఎందుకంటే?

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌ కొత్త సినిమా ‘సలార్‌’ డిసెంబర్‌ 22న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి పోటీగా షారూక్‌ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన డిఫరెంట్‌ మూవీ ‘డంకీ’ డిసెంబర్‌ 21న రిలీజ్‌ కాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఉంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా తెలుగు నుంచి ‘డంకీ’ తప్పుకుందని తెలుస్తోంది. ‘సలార్‌’లాంటి సినిమా తెలుగులో రిలీజ్‌ అవుతోందంటే తప్పకుండా థియేటర్ల సమస్య ఎదురవుతుందని ‘డంకీ’ మేకర్స్‌ భావిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవడానికి ఈ సినిమా కంటెంట్‌ తెలుగు నేటివిటికీ సంబంధించింది కాకపోవడం కూడా ఒక కారణం అయి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కథాంశంతో ‘డంకీ’ రూపొందింది.

‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలతో షారూక్‌కి కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్‌ బాగా పెరిగింది. ఈ సమయంలో ‘డంకీ’ రిలీజ్‌ అయి సక్సెస్‌ కాకపోతే అతని మార్కెట్‌ దెబ్బతిన్నట్టు అవుతుంది తప్ప లాభం ఏమీ ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. షారూఖ్‌ ఖాన్‌ ప్రమోషన్స్‌లో కూడా స్పీడ్‌ లేకపోవడం, ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చెయ్యకపోవడం చూస్తుంటే వినిపిస్తున్న వార్తలో నిజం ఉందనేది అర్థమవుతోంది. అయితే తెలుగులో ‘డంకీ’ రిలీజ్‌ లేదనే వార్తను అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు.

‘డంకీ’ కథ విషయానికి వస్తే... ఐదుగురు స్నేహితుల కథ ఇది. మిత్రులంతా కలిసి లండన్‌ వెళ్ళాలనుకుంటారు. అక్కడికి వెళ్లాలంటే ఇంగ్లీష్‌ వచ్చి ఉండాలని తెలుసుకుంటారు. వారికి వీసా కూడా రిజెక్ట్‌ అవుతుంది. గతంలో బ్రిటిష్‌ వారు ఇండియా అక్రమంగా ఎలా వచ్చారో వీరు కూడా లండన్‌ అలాగే వెళతారు. అక్కడికి వెళ్ళిన ఈ ఐదుగురు స్నేహితులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలతో ఘన విజయాలు అందుకున్న షారూక్‌ ‘డంకీ’తో హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా తెలుగు వెర్షన్‌ అనుకున్న తేదీకి లేదు అనే వార్త స్ప్రెడ్‌ అవుతుండడంతో తెలుగులో రిలీజ్‌ లేదనే అందరూ భావిస్తున్నారు. ఈ విషయంలో మేకర్స్‌ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.