English | Telugu

50 రోజులు పూర్తి చేసుకున్న 'భగవంత్ కేసరి'.. బాలయ్య రేర్ రికార్డు!

ఈరోజుల్లో సినిమాలు రెండు మూడు వారాలు ఆడటమే గొప్ప విషయం. అలాంటిది నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలు మాత్రం అర్ధశత దినోత్సవం జరుపుకొని ఆశ్చర్యపరుస్తున్నాయి. బాలయ్య గత చిత్రాలు 'అఖండ', 'వీరసింహారెడ్డి' పలు సెంటర్లలో 50 రోజులు ఆడాయి. ఇప్పుడు అదే బాటలో 'భగవంత్ కేసరి' పయనించింది.

బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ యాక్షన్ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. ఇటీవల ఓటీటీలో అందుబాటులోకి వచ్చి, అక్కడా సంచలనాలు సృష్టిస్తోంది. ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నప్పటికీ.. ఈ సినిమా 15 సెంటర్లలో అర్ధశత దినోత్సవం జరుపుకుంటోంది. అందులో 11 డైరెక్ట్ సెంటర్లు కాగా, నాలుగు షిఫ్ట్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ 50 డేస్ సినిమాలున్న హీరో బాలయ్యనే కావడం విశేషం.

భగవంత్ కేసరి 50 రోజుల సెంటర్ల వివరాలు:

డైరెక్ట్:
1. మదనపల్లి - కృష్ణా
2. హిందూపురం - గురునాథ్
3. ధర్మవరం - వరలక్ష్మీ
4. తాడిపత్రి - సాయితేజ
5 . కర్నూలు - ఆనంద్ స్క్రీన్3
6. నంద్యాల - రామనాథ్
7. ఆళ్లగడ్డ - మినీ శ్రీరామ్
8. జమ్మలమడుగు - TPR
9. చిలకలూరిపేట - రామకృష్ణ
10. ఏలూరు - సత్యనారాయణ స్క్రీన్1
11. గాజువాక - కన్య

షిఫ్ట్:
12. గుంతకల్లు - వాసవి
13. అనంతపురం - గంగ
14. ఎమ్మిగనూరు - శ్రీనివాస
15. ఖమ్మం - KPS

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.