English | Telugu

భారత్ గెలుపుపై నటి వివాదాస్పద వ్యాఖ్యలు!

"అత్త తిట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు" అనే సామెతని గుర్తు చేస్తూ, "తాము ఓడిపోయినందుకు కాదు.. భారత్ గెలిచినందుకు" అన్నట్టుగా ఉంది పాకిస్థాన్ ఏడుపు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వన్డే వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ కి అర్హత సాధించలేక పాకిస్థాన్ ఎలిమినేట్ కాగా, భారత్ మాత్రం సెమీస్ లో గెలిచి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. దీంతో పాక్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ కడుపు మంటను బయటపెడుతున్నారు.

బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బ్యాట్స్ మెన్ తో పాటు, బౌలర్ షమీ అద్భుతమైన పర్ఫామెన్స్ తో భారత్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. అయితే భారత ఆటగాళ్ళ ప్రతిభను తక్కువచేస్తూ, వాళ్ళు మంచి నటులు అంటూ పాక్ నటి సెహర్ షిన్వారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. "భారత జట్టు ఆటగాళ్లు మంచి నటులు. మ్యాచ్ ఫిక్స్ అయిందని వారికి తెలుసు కానీ తాము నిజంగా మ్యాచ్ ఆడుతున్నట్లు నటించారు." అంటూ ట్వీట్ చేసింది. మరో ట్వీట్ లో "భారత జట్టు మళ్లీ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకు ఈ దేశం అన్నింటిలో మనకంటే ముందుంది. ఫైనల్ లో ఆస్ట్రేలియా లేదా సౌత్ ఆఫ్రికా గెలవాలి." అంటూ మనసులోని విషాన్ని వెళ్లగక్కింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .