English | Telugu

అక్షరాలా ఆరు ఫైట్లు.. సూర్య ఇమేజ్‌ ఎక్కడికో వెళ్లిపోతుందట!

హీరో సూర్య ఎంత కమిటెడ్‌గా వర్క్‌ చేస్తాడో అందరికీ తెలిసిందే. తను చేసే ప్రతి సినిమాలోనూ అతని కష్టం కనిపిస్తుంది. ప్రతి సినిమానూ ప్రాణం పెట్టి చేస్తాడు కాబట్టే ప్రేక్షకులు కూడా అతన్ని, అతని సినిమాలను ఆదరిస్తారు. తాజాగా సూర్య చేస్తున్న సినిమా ‘కంగువా’. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌, యువి క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీని రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సూర్య కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్‌ బడ్జెట్‌ సినిమానే కాకుండా, ఇప్పటివరకు అతను చెయ్యని ఓ డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌ కూడా. 2డి, 3డి ఫార్మాట్‌లలో ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది.

ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను చెన్నయ్‌లో చిత్రీకరిస్తున్నారు. సూర్య గెటప్‌ ఈ సినిమాలో చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. అతని క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా చేశాడు డైరెక్టర్‌ శివ. ఇక యాక్షన్‌ సీక్వెన్స్‌ల గురించి చెప్పాలంటే సినిమాలో మొత్తం ఆరు ఫైట్స్‌ ఉంటాయి. ఈ ఆరు ఫైట్స్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్‌ చేశారట. అండర్‌ వాటర్‌లో తీసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ ఆడియన్స్‌ని బాగా థ్రిల్‌ చేస్తుందని తెలుస్తోంది. అలాగే ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లోని ఫైట్‌ హాలీవుడ్‌ మూవీని తలపించేలా ఉంటుందట. ఇక బీచ్‌లో, బోట్‌లో, ఫ్లైట్‌లో, జిమ్‌లో డిఫరెంట్‌ ప్యాట్రన్‌లో తీసిన యాక్షన్‌ సీన్స్‌ సినిమాకి పెద్ద పైలైట్‌ కాబోతున్నాయని తెలుస్తోంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా కోసం సూర్య అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సూర్య సరసన దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్‌, జగపతిబాబు క్యారెక్టర్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. వచ్చే సంవత్సరం సమ్మర్‌ సీజన్‌లో ఈ సినిమాను 6 భాషల్లో రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.