English | Telugu

కావాలనే నా మీద బురద జల్లుతున్నారు.. సురేష్ కొండేటి క్లారిటీ!

ఇటీవల గోవాలో జరిగిన సంతోషం ఫిల్మ్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌లో అసౌకర్యానికి గురైన పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. తమను అవమానపరిచిందని తెలుగు సినిమా ఇండస్ట్రీనే ఈ వివాదంలోకి లాగారు. ఈ ఫంక్షన్‌ నిర్వహించింది మెగా ఫ్యామిలీ పీఆర్వో అని కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. దీనిపై అల్లు అరవింద్‌ స్పందించి, అవార్డ్స్‌ ఫంక్షన్‌తోగానీ, సురేష్‌కొండేటితోగానీ తమకు సంబంధం లేదని, ఈ ఫంక్షన్‌ అతని వ్యక్తిగతమని, దానిలోకి తెలుగు సినిమా ఇండస్ట్రీని లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఫంక్షన్‌లో అసౌకర్యానికి గురైన కన్నడ చిత్ర ప్రముఖులు సురేష్‌ కొండేటి నుంచి తమకు వివరణ కావాలని కోరారు.

దీనిపై స్పందించిన సురేష్‌ కొండేటి ట్విట్టర్‌ వేదికగా వివరణ ఇచ్చారు. ‘అందరికీ నమస్కారం. గత 21 సంవత్సరాలుగా నేను సంతోషం అవార్డ్స్‌ ఇస్తున్నాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. దీనితో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు . ప్రతి సంవత్సరం ఎంతో కష్టపడి, గ్రాండ్‌గా నేను ఒక్కడినే అవార్డ్స్‌ ఇస్తున్నాను. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే. అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్‌ ఇస్తున్నాను. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల గోవా ఫంక్షన్‌కి వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్‌కి రూమ్స్‌ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్‌లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్‌. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్‌ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను. నామీద కొంతమంది కావాలని బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ స్పందించారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.