English | Telugu

సమంత నటించిన వెబ్ సిరీస్ ని ఎందుకు పట్టించుకోవడం లేదు  

హీరోలతో పాటు సమానంగా క్రేజ్ ని తెచ్చుకునే హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. ఆలాంటి అరుదైన నటి సమంత. సమంత సినిమాలో ఉంటే చాలు ఆ సినిమా క్రేజీ ప్రాజెక్ట్ గా మారిపోతుంది.అలాగే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేసి నేషనల్ వైడ్ గా పేరు సంపాదించింది. స్టిల్ ఇప్పటికి ఎంతో మంది నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం రెడీ గా ఉన్నారు. అంతటి క్రేజ్ ని సంపాదించుకున్న సమంత కి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సంచలనం సృష్టిస్తుంది.

సమంత నుంచి వచ్చిన లాస్ట్ చిత్రం ఖుషి. విజయ్ దేవరకొండ సరసన సమంత ఆ సినిమా చేస్తున్నప్పుడే సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ ని కూడా చేసింది. అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం చేసుకున్న ఈ సిరీస్ ని సమంత కంప్లీట్ కూడా చేసింది. కానీ ఇప్పుడు ఈ సిరీస్ విషయంలో ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. దీంతో ఈ సిరీస్ నిలిచిపోయిందా అనే అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సిటాడెల్ ఒరిజినల్ వెర్షన్ అయిన ఇంగ్లీష్ సిటాడెల్ సిరీస్ కి ప్రేక్షకుల నుంచి అంతగా రెస్పాన్స్ రాకపోవడంతో తెలుగు వెర్షన్ ని ఆపేసారేమో అని అందరు అనుకుంటున్నారు.

ఇక సమంత అనారోగ్యం కారణంతో సినిమాల నుంచి ఒక ఏడాది గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం ఆమె ట్రీట్మెంట్ దశలో ఉంది. ఆమె తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాక మరింత ఉత్సాహంగా నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.