English | Telugu

ఆ రెండింటికి మాత్ర‌మే సామ్ గ్రీన్ సిగ్న‌ల్‌

స్టార్ హీరోయిన్ స‌మంత ఇప్పుడు సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. ప్ర‌స్తుతం ఆమె ఆధ్యాత్మిక‌తో పాటు త‌న ఆరోగ్యంపై ఫోక‌స్ చేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా వీడియోస్‌, ఫొటోస్ ద్వారా రివీల్ చేస్తూనే ఉందీ చెన్నై సొగ‌స‌రి. తాజాగా స‌మంత త‌న లేటెస్ట్ లుక్‌ను పోస్ట్ చేసింది. ఆ లుక్‌ను చూసిన వారంద‌రూ షాక్ అవుతున్నారు. అస‌లు సామ్ ఎందుకిలా త‌న లుక్‌ని మార్చేసిందో అర్థం కాలేదు. స‌మంత స‌న్న‌బ‌డుతోంది. అయితే హెల్త్ కోస‌మే స‌మంత అలా చేస్తుందంటూ కొంద‌రు అంటున్నారు.

మ‌రో వైపు సమంత హీరోయిన్‌గా న‌టించిన ఖుషి సినిమా సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ అవుతుంది. మ‌రో వైపు ఫ్యామిలీ మేన్ సిరీస్ త‌ర్వాత సామ్ చేసిన వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రేక్షకుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. ముందుగా మాత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో స‌మంత జోడీ క‌ట్టిన ఖుషి థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నుంది. మ‌రిప్పుడు పూర్తి రెస్ట్‌లో ఉన్న స‌మంత ఖుషి ప్ర‌మోష‌న్స్‌కు వస్తుందా? రాదా? అని అంద‌రూ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అయితే తాజాగావినిపిస్తోన్నస‌మ‌చారం మేర‌కు ఖుషి సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటానని స‌మంత చెప్పేసింది.

అయితే స‌మంత పెట్టిన కండీష‌న్ మాత్రం నిర్మాత‌ల‌కు ఓ ర‌కంగా షాకిచ్చింది. అదేంటంటే.. ఓ కామ‌న్ ఇంట‌ర్వ్యూతో పాటు ఓ మ్యూజిక‌ల్ నైట్ ఈవెంట్ (ప్రీ రిలీజ్‌)కు మాత్రమే వ‌స్తాన‌ని సామ్ చెప్పేసింద‌ట‌. ఇక స‌రేన‌న‌టం నిర్మాత‌ల‌వంతైంది. మ‌జిలీ త‌ర్వాత శివ నిర్వాణ డైరెక్ష‌న్‌లో సమంత చేసిన సినిమా ఇది. ఇప్పుడు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, న‌వీన్ ఎర్నేని ఈ సినిమాను నిర్మించారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.