English | Telugu

రాజ్ విషయంలో సమంత కీలక నిర్ణయం!

-ఏంటి ఆ కీలక నిర్ణయం
-అభిమానుల సంతోషం
-సమంత అప్ కమింగ్ సినిమాలు ఏవి!


అభిమానులు ఆశించినట్టుగానే సమంత(Samantha)ప్రముఖ హీరో 'నాగ చైతన్య'(Naga Chaitanya)తో విడాకులు తీసుకున్న చాలా సంవత్సరాలకి మళ్ళీ పెళ్లి చేసుకొని అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. దీంతో దర్శకుడు రాజ్(Raj)తో తన నూతన జీవితం బాగుండాలని వాళ్లంతా కోరుకుంటున్నారు. సమంత రాకతో తమ కుటుంబం పరిపూర్ణమైందని రాజ్ కుటుంబ సభ్యులు కూడా పేర్కొనడంతో సమంత కి సదరు రాజ్ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో కూడా అర్ధమవుతుంది.ఇక రాజ్ విషయంలో సమంత ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది.

రాజ్ సుదీర్ఘ కాలం నుంచి దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా సినీ రంగంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజ్ తెలుగు వాడైనా సరే ముంబై(Mumbai)లోనే ఎప్పట్నుంచో నివాసం ఉంటున్నాడు. దీంతో హైదరాబాద్ లో ఉంటున్న సమంత ముంబైలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఫ్యూచర్ లో తెలుగు సినిమాలు చేసినా ముంబై నుంచే రాకపోకలు సాగించాలని సమంత ప్లాన్ అని కూడా చెప్తున్నారు.

also read:ఈ రోజు బెనిఫిట్ షో కి ఏం జరగబోతుంది. బాలయ్య చూసే ఏరియా ఇదేనా!

ప్రస్తుతం తెలుగులో సమంత సినీ కెరీర్ ని చూసుకుంటే ఎలాంటి కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. కొన్ని నెలల క్రితం స్వీయ నిర్మాణంలో 'మా ఇంటి మహాలక్షి' మూవీని అనౌన్స్ చేసినా సదరు చిత్రం గురించి అప్ డేట్ వచ్చి చాలా రోజులు అయింది. ఆ సినిమా ఆగిపోయిందనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. హిందీలో మాత్రం తన భర్త రాజ్ తో కలిసి 'రక్త్ బ్రహ్మాండ్.. ది బ్లడీ కింగ్ డమ్' అనే వెబ్ మూవీ చేస్తున్నట్టుగా టాక్. నిజానికి చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్జ్ గురించి వార్తలు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ నిర్మాణం వహిస్తుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.