English | Telugu

నెక్స్‌ట్‌ ఏంటి.. కరేబియన్‌ ఐలాండ్‌లో ఐబొమ్మ రెస్టారెంట్‌!

- 17 కోట్ల‌తో 86 దేశాలు చుట్టిన ర‌వి
- క‌రేబియ‌న్ ఐలాండ్ అంత‌టా ఐబొమ్మ రెస్టారెంట్లు
- ఐబొమ్మ సంపాద‌న ఎంజాయ్ చెయ్య‌డానికే

పైరసీతో సినిమా పరిశ్రమను, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు ఇమ్మడి రవి. పోలీసు కస్టడీలో అనేక వివరాలను రవి నుంచి రాబట్టారు పోలీసులు. అందులో భాగంగానే తన భవిష్యత్‌ ప్రణాళికలను కూడా తెలిపాడు రవి. కరేబియన్‌ దీవుల్లో ఐబొమ్మ పేరుతో ఓ రెస్టారెంట్‌ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు.


ఐబొమ్మ ద్వారా సంపాదించిన 17 కోట్ల రూపాయలు తను ఎంజాయ్ చెయ్యడానికే ఖర్చు చేశానని, ఆ డబ్బుతోనే 86 దేశాలు చుట్టి వచ్చానని చెబుతున్నాడు రవి. ప్రస్తుతం ఐబొమ్మ సైట్‌ను క్లోజ్‌ చేశారు కాబట్టి తన తదుపరి ఆలోచన రెస్టారెంట్‌ అని పోలీసుల విచారణలో రవి తెలిపాడు. ఇండియన్‌ డిషెస్‌ను కరేబియన్‌ ప్రజలకు పరిచయం చెయ్యాలని ఉందని, అందుకే అక్కడ రెస్టారెంట్‌ ప్రారంభించబోతున్నట్టు చెబుతున్నాడు.


కరేబియన్‌ ఐలాండ్‌లోని అన్ని దేశాల్లో ఐబొమ్మ రెస్టారెంట్‌ బ్రాంచ్‌లను విస్తరిస్తానని అంటున్నాడు రవి. ఇప్పటికే అతన్ని రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు.. అతనికి సంబంధించిన 3 కోట్ల రూపాయలను సీజ్‌ చేశారు. అయితే కోర్టులో ఈ కేసు విచారణ ఎలా ఉంటుంది? రవి తరఫు న్యాయవాది వాదన ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇమ్మడి రవి కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది, కోర్టు తీర్పు ఎలా వుండబోతుంది అనే విషయాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.