English | Telugu

నెలరోజుల్లో ‘సలార్‌’... ఆందోళనలో డిస్ట్రిబ్యూటర్లు!

ఒకప్పటి స్టార్‌ హీరోల సినిమాలకి, ఇప్పటి స్టార్‌ హీరోల సినిమాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. అప్పట్లో సినిమా ప్రారంభం అవుతుండగానే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలకు అడ్వాన్సులు ఇచ్చేసేవారు. సినిమా కథ ఏమిటి, ఎంత బడ్జెట్‌ పెడుతున్నారు. ఎక్కడెక్కడ తీస్తున్నారు.. ఈ వివరాల గురించి పట్టించుకోకుండా సినిమా తమది అనిపించుకునేవారు. దీని కంటే ముందు డిస్ట్రిబ్యూటర్లదే రాజ్యంగా ఉండేది. ఒక నిర్మాత సినిమా తీస్తున్నాడంటే ఏ హీరో అయితే కలెక్షన్లు వస్తాయి, ఏ హీరోయిన్‌ అయితే జనం బాగా చూస్తారు, సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ ఉండాలా, ఉంటే ఎవరితో చేయించాలి.. ఇలాంటివన్నీ డిస్ట్రిబ్యూటర్లే నిర్మాతలకు సూచించేవారు. అయితే ఇప్పటి పరిస్థితి వేరు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి గాలిలో దీపం పెట్టి ఎదురుచూడడమే అన్నట్టుగా తయారైంది. వందల కోట్లు పెట్టి సినిమా తీసినా నిర్మాతలు సేఫ్‌ అవ్వడం లేదు, డిస్ట్రిబ్యూటర్లూ సేఫ్‌ అవ్వడం లేదు. ఎంత రేట్‌ అయినా ఇచ్చి డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనుక్కున్నా.. నిర్మాతలు సరైన ప్రమోషన్‌ చెయ్యకపోతే సినిమా జనంలోకి వెళ్ళదు. అది కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుంది.

ఇప్పుడు ‘సలార్‌’ పరిస్థితి కూడా అలాగే తయారైంది అంటున్నారు. ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఉన్నప్పటికీ ఎప్పటి నుంచో షూటింగ్‌ జరుగుతుండడం, రిలీజ్‌ వాయిదా పడడం వంటి అంశాలు సినిమాని దెబ్బతీసేలా ఉన్నాయని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమా మీద రానురాను క్రేజ్‌ తగ్గుతోందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారని సమాచారం. డిసెంబర్‌ 22న ‘సలార్‌’ రిలీజ్‌ అవుతుండగా దానికి సంబంధించి ఎలాంటి హడావిడి చేయడం లేదు నిర్మాతలు. మరో నెల రోజులు మాత్రమే టైమ్‌ ఉంది. భారీబడ్జెట్‌తో తీసిన పాన్‌ ఇండియా సినిమా అంటే నెల ముందు నుంచే ఏదో ఒక మాధ్యమంలో సందడి చేస్తూనే ఉండాలి. కానీ, అలాంటిదేమీ కనిపించడం లేదు. ఇప్పటికే ప్రభాస్‌ ఇప్పటికే వరస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. సలార్‌ కూడా అటూ ఇటూ అయ్యిందంటే అతని కెరీర్‌ అయోమయంలో పడినట్టేనని ట్రేడ్‌వర్గాలు భావిస్తున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.