English | Telugu

మ‌లేషియా ప్ర‌ధాని రజనీకాంత్‌ గుండు కామెడీ!

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌కు ఇక్క‌డే కాదు ప్ర‌పంచం యావ‌త్తు భారీ సంఖ్య‌లో అభిమానులున్నారు. జ‌పాన్‌, మ‌లేషియా, సింగ‌పూర్, అమెరికా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టే చాటంత అవుతుంది. సామాన్యులే కాదు.. సెల‌బ్రిటీలు సైతం తలైవ‌ర్‌కి అభిమానులు కావ‌ట‌మే ఇక్క‌డి విశేషం. ఇప్పుడు అందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ దొరికింది. వివ‌రాల్లోకి వెళితే రీసెంట్‌గా ర‌జినీకాంత్ మ‌లేషియా ప్ర‌ధాని అన్వ‌ర్ ఇబ్ర‌హీంను క‌లిశారు. వీరిద్ద‌రి భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ర‌జినీకాంత్ ఎప్ప‌టిలాగానే సింపుల్‌గా క‌నిపిస్తున్నారు. మ‌లేషియా ప్ర‌ధాని అన్వ‌ర్ ఇబ్ర‌హీం మాత్రం ర‌జినీను చూడ‌గానే ఆనందం ప‌ట్ట‌లేక‌పోయారు. శివాజీ సినిమ‌లో గుండుతో ఉన్న‌ప్పుడు బాస్ గుండు బాస్ అంటూ ర‌జినీ చేసే స్టైల్‌ను ఆయ‌న ఇమిటేట్ చేశారు.

మ‌లేషియా ప్ర‌ధాని అలా చేయ‌టం చూసి రజినీకాంత్ ఆనందంతో న‌వ్వేశారు. ఆనంత‌రం వీరు ఆప్యాయంగా క‌లుసుకుని మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను అన్వ‌ర్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఏషియాతో పాటు ప్ర‌పంచంలోనే గొప్ప యాక్ట‌ర్‌ను క‌లిశాను. ప్ర‌జ‌ల క‌ష్ట‌, న‌ష్టాల్లో నేను అందించిన సేవ‌ల‌పై రజినీకాంత్ స్పందించిన తీరు, గౌర‌వంపై అభినందిస్తున్నాను. అలాగే ఆయ‌న త‌దుప‌రి తీయ‌బోతున్న సినిమాల్లోనూ సామాజిక అంశాలు ఎక్కువ‌గా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అనుకుంటున్నాను. ఆయ‌న ఎంచుకునే ప్ర‌తీ రంగంలోనూ రాణించాల‌ని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు అన్వర్.

రీసెంట్‌గా జైల‌ర్ సినిమాతో ర‌జినీకాంత్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేశారు. ఆ సినిమా రూ.650 కోట్ల మేర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది. ఈ చిత్రానికి నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ ఈ సినిమాను నిర్మించారు. త్వ‌ర‌లోనే ఆయ‌న త‌న 170వ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై జై భీమ్ ఫేమ్ టి.జి.జ్ఞాన‌వేల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .